Man kills daughter : 'తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. అందుకే కూతురిని చంపేశా'-bengaluru man kills 2 year old daughter as he didn t have money to feed her ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bengaluru Man Kills 2-year-old Daughter As He Didn't Have Money To Feed Her

Man kills daughter : 'తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. అందుకే కూతురిని చంపేశా'

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 28, 2022 07:04 AM IST

Bengaluru man kills daughter : ఆ వ్యక్తికి.. వ్యాపారంలో నష్టం వచ్చింది. 6నెలలుగా ఉద్యోగం కూడా లేదు. తిండి పెట్టడానికి డబ్బులు లేవనే కారణంతో.. రెండేళ్ల కూతురిని చంపేశాడు! ఈ ఘటన బెంగళూరులో కలకలం సృష్టించింది.

'తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. అందుకే కూతురిని చంపేశా'
'తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. అందుకే కూతురిని చంపేశా'

Bengaluru man kills daughter : బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన రెండేళ్ల కమార్తెను హత్య చేశాడు. తిండి పెట్టడానికి డబ్బులు లేని కారణంతోనే ఈ పని చేసినట్టు పోలీసులకు చెప్పాడు.

ఇదీ జరిగింది..

గుజరాత్​కు చెందిన రాహుల్​ పార్మర్​ అనే వ్యక్తికి.. భవ్య అనే మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి రెండేళ్ల పాప ఉంది. కుటుంబం మొత్తం.. రెండేళ్ల క్రితం.. గుజరాత్​ నుంచి వలస వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు.

కాగా.. గత ఆరు నెలలుగా పార్మర్​కు ఉద్యోగం లేదు. అదే సమయంలో.. బిట్​కాయిన్​ వ్యాపారంలో భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఫలితంగా తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.

Man kills daughter : ఈ సమయంలోనే.. పార్మర్​ ఇంట్లో బంగారం ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది అని తెలుసుకునేందుకు తరచు అక్కడికి వెళ్లేవాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసిపోయింది. సొంత ఇంట్లో.. బంగారం ఆభరణలు దొంగిలించిన పార్మర్​.. కుటుంబసభ్యులకు తెలియకుండా వాటిని తాకట్టు పెట్టాడని పోలీసులకు అర్థమైంది. తప్పుడు కేసు చేసి సమయాన్ని వృథా చేశాడని తేల్చారు. ఈ విషయం పార్మర్​కు తెలిసింది.

ఇది జరిగిన కొన్ని రోజులకు.. పార్మర్​ భార్య పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తన భర్త, రెండేళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.

Bengaluru crime news : గత శనివారం రాత్రి.. కెండట్టి గ్రామంలోని ఓ చెరువులో రెండళ్ల చిన్నారి మృతదేహం.. స్థానికులకు కనిపించింది. ఆ పక్కనే ఓ బ్లూ కలర్​ కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. కోలర్​ పోలీస్ రూరల్​​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పార్మర్​ను అరెస్ట్​ చేశారు. తిండి పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో సొంత బిడ్డను చంపుకున్నట్టు పార్మర్​ తెలిపాడు.

"బిట్​కాయిన్​ వ్యాపారంలో చాలా డబ్బులు కోల్పోయాను. నా బిడ్డకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. అందుకే చంపేశాను," అని విచారణలో అంగీకరించాడు పార్మర్​. కూతురిని చంపిన తర్వాత.. పార్మర్​ సూసైడ్​కు ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

దర్యాప్తు అనంతరం పార్మర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఫేక్​ కేసు పెట్టిన విషయం పోలీసులకు తెలిసిపోయిందన్న భయంతో.. పార్మర్​ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సొంత కూతురిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం