5.8-magnitude earthquake: నేపాల్ లో భూకంపం; ఢిల్లీలో ప్రకంపనలు
Earthquake in Nepal : పొరుగు దేశం నేపాల్ ను మంగళవారం భూకంపం వణికించింది. మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో 5.8 తీవ్రతతో నేపాల్ లో భూకంపం సంభవించింది.
Earthquake in Nepal : నేపాల్ లో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప (Earthquake) కేంద్రం భారత్ లోని ఉత్తరాఖండ్ లో ఉన్న పితోరగఢ్ కు తూర్పుగా 148 కిమీల దూరంలో ఉంది. అందువల్ల ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాలతో పాటు ఢిల్లీలో కూడా భూ కంపనాలు సంభవించాయి. భూమిలో 10 కిమీల లోతున సంభవించిన ఈ భూకంపం కారణంగా ఉత్తర ప్రదేశ్, బిహార్ ల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం(Delhi-NCR)లో నివసిస్తున్న పలువురు భూకంపం (Earthquake) సంభవించిన సమయంలో తమ ఇళ్ళలో వస్తువులు కింద పడడం, సీలింగ్ ఫ్యాన్స్ కదలడం వంటి దృశ్యాలున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దాదాపు నిమిషం పాటు భూ కంపనాలు చోటు చేసుకున్నాయని, ఆ సమయంలో భయాంధోళలకు గురయ్యామని వివరించారు. భూకంపం (Earthquake) సమయంలో పెంపుడు జంతువుల ప్రవర్తనపై ఒక నెటిజన్ ఒక వీడియో షేర్ చేశాడు. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదు.