jabardasth: జబర్దస్త్ నుంచి సుధీర్ ఎందుకు వెళ్లిపోయాడో చెప్పిన రామ్ ప్రసాద్...
జబర్దస్త్ లో గత కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కనిపించడం లేదు. వారు జబర్దస్త్ ను వీడి వెళ్లిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారు వెళ్లిపోవడానికి గల కారణాల్ని టీమ్ లీడర్స్ ఆటో రామప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వెల్లడిస్తూ విడుదల చేసిన తదుపరి ఎపిసోడ్ ప్రోమో ఆసక్తిని పంచుతోంది
గత కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో అతడికి ఏమైంది ఎందుకు కనిపించడం లేదంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుధీర్తోపాటు మరో టీమ్ మెంబర్ గెటప్ శీను కూడా జబర్దస్త్ ను వీడారు. వారిద్దరూ తనను ఒంటరి ని చేసి వెళ్లిపోయారంటూ ఇటీవలే రామ్ ప్రసాద్ ఓ స్కిట్ పూర్తయిన సందర్భంగా వెల్లడించారు.
జబర్దస్త్ నుంచి సుధీర్, గెటప్ శీను వెళ్లిపోవడానికి కారణమేమిటన్నది ఆసక్తికరంగా మారింది. జూన్ 17వ తేదీన ప్రసారం కానున్న జబర్దస్త్ తదుపరి ఎపిసోడ్ తాలూకు ప్రోమో సోమవారం విడుదలైంది. ఇందులో జబర్దస్త్ కంటెస్టెంట్స్ తో జడ్జ్ ఇంద్రజ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్లను సుధీర్ వెళ్లిపోవడానికి గల కారణాల్ని అడిగింది. మీకు ఓ కో టీమ్ లీడర్ ఉండేవాడు.
మీరు తొక్కేయడం వల్లే ఆయన జబర్దస్త్ ను వీడి వెళ్లిపోయాడని అంటున్నారు నిజమేనా అంటూ బుల్లెట్ భాస్కర్ను ఇంద్రజ ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్నకు నేను స్పందించకూడదని చాలా రోజులు అనుకున్నా...ఇప్పుడు కూడా ఎందుకు స్పందిస్తున్నానంటే వెళ్లిపోయిన ఆయన చాలా పెద్దాయన అంటూ బుల్లెట్ భాస్కర్ అన్నాడు. ఆ తర్వాత కూడా అతడు తన సమాధానాన్ని కొనసాగించాడు. అతడు ఏమన్నాడో ప్రోమోలో చూపించలేదు.
అలాగే మీరు స్క్రిప్ట్ లు సరిగా రాయకపోవడం వల్లే టీమ్ మెంబర్స్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా అది నిజమా అంటూ రామ్ ప్రసాద్ ను ఇంద్రజ క్వశ్వన్ అడిగింది. సీరియస్గా ఈ ప్రశ్న అడిగే వాళ్లకు ఇదే నా ఆన్సర్ అంటూ రామ్ ప్రసాద్ సమాధానం చెప్పాడు. అదేమిటో వచ్చే ఎపిపోడ్లోనే చూడాల్సిందే. చివరలో రోజా గారు మినిస్టర్ అవ్వకూడదని మీరు కోరుకున్నారంటా నిజమేనా అంటూ ఇంద్రజను రామ్ ప్రసాద్ అడిగిన ప్రశ్న నవ్వులను పూయించింది.
టాపిక్