GO 111 | జీవో 111 ఎత్తివేతతో మరో హైదరాబాద్ నిర్మితమవుతుందా?! దాని వెనక ఉన్న అసలు కథ ఏంటి?-what is telangana go 111 and why its end by cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Go 111 | జీవో 111 ఎత్తివేతతో మరో హైదరాబాద్ నిర్మితమవుతుందా?! దాని వెనక ఉన్న అసలు కథ ఏంటి?

GO 111 | జీవో 111 ఎత్తివేతతో మరో హైదరాబాద్ నిర్మితమవుతుందా?! దాని వెనక ఉన్న అసలు కథ ఏంటి?

HT Telugu Desk HT Telugu
Apr 12, 2022 11:11 PM IST

తాజాగా కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే.. ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న జీవో 111 ను ప్రభుత్వం ఎత్తివేసింది. అసలు జీవో 111 అంటే ఏంటి? ఎప్పుడు తీసుకొచ్చారు?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

చాలా రోజుల నుంచి జీవో 111 పై వివాదం నడుస్తోంది. ప్రభుత్వం ఉపసంహరిస్తామని ప్రకటిస్తే.. కొంతమంది దీనిని వ్యతిరేకించారు. నిజాం చెప్పాలంటే.. జీవో 111 ప్రభుత్వ సొంత ఆలోచన కాదు. ఆ జీవో వెనక పెద్ద స్టోరీనే ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో.. జీవో 111ను రద్దు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అసలు జీవో వెనక ఉన్న కథేంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది?

నిజాం పాలకుల సమయంలో జంట జలాశయాలు.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. హైదరాబాద్ వాసులకు ఇక్కడి నుంచే తాగు నీరు. అవి లేకుంటే.. హైదరాబాద్ నగరానికి కష్టంగా ఉండేదేమో. ఇలాంటి ముఖ్యమైన జలాశయాలను కాపాడాలనే ఉద్దేశంతో.. 1996లో 111 జీవోను తెచ్చింది అప్పటి ప్రభుత్వం. జలాశయాల్లో నీటి కలుషితం చేయకుండా ఉండటం దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి 1994లో జీవో 192 తీసుకొచ్చారు. గండిపేట చెరువు దగ్గరలో ఓ రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయడంతో.. జీవోను తెచ్చారు. అయితే.., మళ్లీ 1996లో సవరించి జీవో 111గా ఛేంజ్ చేశారు. అలా జీవోలో అనేక నిబంధనలు పెట్టారు.

జీవోలో ఏం ఉందంటే..

జీవో ప్రకారంగా చూసుకుంటే.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల చుట్టూ 10 కిలోమిటర్ల పరిధిలో బయో కన్జర్వేషన్ జోన్ గా ఉంటుంది. ఆ చెరువుల పరిధిలోని లే అవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం విడిచిపెట్టాలి. గ్రామ కంఠాన్ని పక్కనపెడితే.. మిగిలిన చోట్లా భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. చుట్టుపక్కల క్రిమి సంహారక మందుల వినియోగంపై అబ్జర్వేషన్  ఉండాలి. రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాలకు చెందిన 84 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం మెుత్తం విస్తీర్ణం ఎంతంటే.. 538 చదరపు కిలోమీటర్లు. మరో హైదరాబాద్ అన్నమాట. ఈ 84 గ్రామాల్లోని లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. ఇంతటి భూమి భాగ్యనగరానికి దగ్గరలో ఉంది. కేవలం వ్యవసాయ కార్యకలాపాలే కేటాయించాలని ఆదేశించడంతో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు జరగట్లేదు.

శంషాబాద్ మండల పరిధిలోని 47 గ్రామాలు, మొయినాబాద్ మండలంలోని 20 గ్రామాలు దీని కిందకు వస్తాయి. చేవెళ్ల పరిధిలోని 6 గ్రామాలు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల నుంచి 3 గ్రామాలు, షాబాద్ మండలం 2 గ్రామాలు, కొత్తూరు మండలం ఒక గ్రామం కూడా జీవో కిందకే వస్తాయి.

భూముల ధరలకు రెక్కలు

జీవో ఎత్తివేయడంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగుతాయి. అంతకుముందు హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు పెరిగినా.. కూడా జీవో 111 అమలులో ఉంది కాబట్టి.. ఈ గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు. భూములు కొనేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపారు. జీవో వ్యతిరేక పోరాట సమితిని కూడా ఏర్పాటు చేశారు. మహానగరానికి దగ్గరలోనే ఈ భూములు ఉండటంతో.. ఇప్పుడు జీవో ఎత్తివేతతో మరో హైదరాబాద్ నిర్మించవచ్చనే.. అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

అయితే ఎన్ని నిబంధనలు ఉన్నా.. దందా చేసేవారు.. ఆగలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బడాబాబులు.. ఇక్కడ భూములు కొని.., ఫామ్ హౌసులు, విల్లాలు కట్టారు. ఇక పార్టీల ప్రచారాల్లోనూ.. దీనిపై తప్పకుడా హామీ ఉండేది. అధికారం వస్తే.. జీవో ఎత్తివేస్తామని చెప్పేవారు. నాణేనానికి రెండు వైపులా అన్నట్టుగా.. కొంతమంది స్థానికులు సైతం.. ఈ జీవో ఎప్పుడు ఎత్తివేస్తారా అని కూడా చూశారు. మరోవైపు కొంతమంది పర్యావరణ వేత్తలు.. జీవోను.. ఎత్తివేయెుద్దని కోర్టుల చుట్టూ తిరిగారు. జీవో సంగతి పూర్తిగా తేల్చేయాలని ప్రభుత్వం అనుకుంది. అందులో భాగంగానే.. 2016లో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం ఏం చెబుతుందంటే..

111 జీవో అర్థరహితం అని ప్రభుత్వ వాదన. ఈ జీవో పరిధిలో లక్షా 32 వేల 600 ఎకరాల భూమిని గతంలో జంట జలాశయాల పరిరక్షణ కోసం ఇచ్చారని చెబుతోంది. అయితే హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడం కోసం ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోందని ప్రభుత్వం అంటోంది. వందేళ్లు నగరానికి తాగునీటి కొరత ఉండదని.. 111 జీవోకు అర్థం లేదంటోంది. విలువైన భూములు ఖాళిగా ఉంటున్నాయని వాదన. అందులో భాగంగానే.. తాజాగా మంత్రివర్గ సమావేశంలో జీవో 111పై కీలక నిర్ణయం తీసుకున్నారు. జీవోను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

IPL_Entry_Point