Trisha web series Brinda: త్రిష ఓటీటీ డెబ్యూ బృందా షూటింగ్ పూర్తి
Trisha Krishnan web series Brinda: త్రిష నటించిన బృందా వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది.
అందాల నటి త్రిష కృష్ణన్ తన తొలి ఓటీటీ వెబ్ సిరీస్ బృందా షూటింగ్ను పూర్తి చేసినట్లు వెల్లడించింది.
‘పొన్నియిన్ సెల్వన్: పార్ట్-1’ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన త్రిష ఇన్స్టాగ్రామ్లో తాజా వార్తలను షేర్ చేశారు. షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
‘షూటింగ్ పూర్తయింది. బృందా సీజన్ 1 కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...’ అని త్రిష పోస్ట్ చేశారు.
39 ఏళ్ల ఈ నటి సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్లో పోలీసు పాత్రను పోషిస్తున్నారు. ‘బృందా’ త్వరలో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ప్రారంభమవుతుంది.
త్రిష కృష్ణన్ ఇటీవల చిత్రనిర్మాత మణిరత్నం మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1’లో కనిపించారు. ఆమె రాబోయే ప్రాజెక్ట్లలో అరవింద్ స్వామితో ‘సతురంగ వేట్టై 2’, మోహన్లాల్ నటించిన ‘రామ్’, ఇంకా ‘ది రోడ్’ చిత్రాలు ఉన్నాయి.
దక్షిణాది పాపులర్ స్టార్స్ ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సమంత తొలిసారిగా కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ సంచలన విజయం నమోదు చేసింది. తాజాగా త్రిష కూడా బృందా వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో తెరంగేట్రం చేయనుంది.
టాపిక్