Shabaash Mithu : మిథాలీ రాజ్ బయో పిక్ జులై 15న విడుదల
తాప్సీ పన్ను నటించిన శభాష్ మిథు జులై 15న థియేటర్లలో విడుదల కానుంది. క్రికెటర్ మిథాలీ రాజ్ బయో పిక్ ఇది.
ముంబై: భారత క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్గా తన రాబోయే చిత్రం ‘శభాష్ మిథు’ జూలై 15న థియేటర్లలోకి రానుందని బాలీవుడ్ స్టార్ తాప్సీ పన్ను శుక్రవారం ప్రకటించింది.
శ్రీజిత్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రియా అవెన్ కథ అందించారు. ఇది మిథాలి రాజ్ జీవితంలోని హెచ్చు తగ్గులు, ఎదురుదెబ్బలు, ఆనందభరిత క్షణాలను చూపుతుంది. మిథాలి రాజ్ పాత్రను పోషించిన తాప్సీ పన్ను ఈ చిత్రం విడుదల తేదీని ట్విట్టర్లో పంచుకున్నారు.
‘కలలు కంటూ వాటిని సాకారం చేసుకునేందుకు ప్రణాళిక ఉన్న అమ్మాయి కంటే శక్తివంతమైనది మరొకటి లేదు! ఈ 'జెంటిల్మెన్ గేమ్'లో బ్యాట్తో తన కలను వెంబడించిన అలాంటి ఒక అమ్మాయి కథ ఇది. 15 జూలై 2022న మీ ముందుకొస్తోంది..’ అంటూ తాప్సీ తన పోస్ట్లో తెలిపింది.
క్రికెటర్ మిథాలీ రాజ్ 23 ఏళ్ల కెరీర్ను కలిగి ఉంది. ఆమె వన్డే అంతర్జాతీయ మ్యాచ్లలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలను సాధించింది. నాలుగు వరల్డ్ కప్లలో భారతదేశానికి నాయకత్వం వహించింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో తాప్సీ పన్ను ‘హసీన్ దిల్ రుబా’, ‘అన్నాబెల్లె సేతుపతి’, ‘రష్మీ రాకెట్’, ‘లూప్ లపేట’ తదితర నాలుగు సినిమాలలో నటించినా అవి వివిధ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో విడుదలయ్యాయి.
తాప్సీ పన్ను తన 2020 సంవత్సరపు చిత్రం ‘తప్పడ్’ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ‘శభాష్ మిథు’ ద్వారా తాప్సీ పన్ను థియేటర్లలో కనిపించనుంది.
వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన శభాష్ మిథులో అనుభవజ్ఞుడైన నటుడు విజయ్ రాజ్ కూడా ఉన్నారు.
సంబంధిత కథనం
టాపిక్