Allu Arjun| సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్.. ఆలయంలో ప్రత్యేక పూజలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముచ్చింతల్లో విచ్చేసి సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని బన్నీ తెలిపారు.
ముచ్చింతల్లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవలే అక్కడ సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు సమతామూర్తిని దర్శించుకోవడం కోసం ముచ్చింతల్కు క్యూ కడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమతామూర్తిని దర్శించుకున్నారు. ముచ్చింతల్కు వచ్చిన ఆయన.. సమతామూర్తి విగ్రహంతో పాటు కొన్ని దివ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రత్యేక సిబ్బంది అల్లు అర్జున్కు ఆలయ విశేషాలను వివరించారు. బన్నీకి క్షేత్ర విశేషాలు సహస్సాబ్ది ఉత్సవాల విశిష్టత, సమతామూర్తి విగ్రహ ప్రాశస్త్యాన్ని సవివరంగా తెలిపారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను ఆయన దగ్గరుండి వీక్షించారు. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చినజీయార్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. సమతామూర్తి దర్శఇంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎంత చూసినా తనివి తీరలేదని బన్నీ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్ర సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఒక్క హిందీలోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిందని చిత్ర వర్గాల సమాచారం. మొత్తంగా రూ.350 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.
పుష్ప చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 7న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్లలో చూసేవారి సంఖ్య మాత్రం తగ్గలేదు. ఆ విధంగా రెండు రకాలుగా వసూళ్లను రాబట్టుకుంది. ఇదే జోష్ను కొనసాగించాలని బన్నీ భావిస్తున్నారు. త్వరలో పుష్2 చిత్రాన్ని మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ మరోసారి మ్యాజిక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నేడు ముచ్చింతల్ కు బండారు దత్తాత్రేయ..
ఇప్పటికే అమిత్ షా, పవన్ కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు సమతామూర్తిని దర్శించుకున్నారు. శనివారం నాడు హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ముచ్చింతల్కు రానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఇక్కడకు వచ్చి సమతామూర్తి దర్శించుకుని శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమరోహ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ వ
సంబంధిత కథనం