Sai Pallavi: నేను ప్రమోషన్స్ చేయలేదన్నారు...గార్గి సక్సెస్ మీట్ లో సాయిపల్లవి ఎమోషనల్ స్పీచ్
గార్గి (gargi) తన కెరీర్ లో చాలా ముఖ్యమైన సినిమా అని సాయిపల్లవి(sai pallavi) పేర్కొన్నది. కథను నమ్మి ఈ సినిమా చేశానని చెప్పింది. ఆదివారం హైదరాబాద్ జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో సాయిపల్లవి ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ సినిమా గురించి సాయిపల్లవి ఏం చెప్పిందంటే...
సాయిపల్లవి కథానాయికగా నటించిన గార్గి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమకాలీన సమస్యలకు కోర్డ్ రూమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి రూపొందించిన ఈ సినిమాలో రియలిస్టిక్ యాక్టింగ్ తో సాయిపల్లవి ఆకట్టుకున్నది. గార్గి పాత్రలో ఆమె నటన, ఎమోషన్స్ పడించిన విధానంపై ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గార్గి సక్సెస్ మీట్ ను (gargi success meet) హైదరాబాద్ లో నిర్వహించారు. గార్గి తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అని సాయిపల్లవి పేర్కొన్నది.
ఆమె మాట్లాడుతూ సాయిపల్లవి నటించిన సినిమా అనే భరోసాతోనే మల్టీప్లెక్స్ లలో తక్కువ స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారని సాయిపల్లవి చెప్పింది. డిస్ట్రిబ్యూటర్లకు సినిమా నచ్చడంతో థియేటర్ల సంఖ్యను పెంచుతున్నామని వారు నాతో చెప్పారని పేర్కొన్నది. డిస్ట్రిబ్యూటర్ల ఆ మాట చెప్పగానే ఆనందం వేసిందని తెలిపింది. ‘అంతేకాకుండా తెలుగులో గార్గి సినిమాను నేను సరిగా ప్రమోట్ చేయాలేదని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నా వరకు ప్రమోషన్స్ కు సంబంధించి నేను అన్ని కరెక్ట్ గానే చేశా’ అని సాయిపల్లవి చెప్పింది.
తన లైఫ్ లో గార్గి చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్ అని సాయిపల్లవి తెలిసింది. నటిగా నా ప్రతిభను ను చూపించాలనే ఆలోచనతో కాకుండా కేవలం కథను నమ్మి ఈ సినిమా చేశానని సాయిపల్లవి చెప్పింది. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే బాధ్యత తనపైనే ఎక్కువగా ఉంటుందని, అందుకు ప్రతి సినిమాలో యాక్టింగ్ పరంగా బెస్ట్ ఇవ్వడానికే కష్టపడుతున్నానని చెప్పింది. ఆ ఒత్తిడిని తాను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొన్నది.
గార్గి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కేటరిగీ పరిమితం చేయవద్దని, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని సాయిపల్లవి అన్నది. సినిమా బాగుందని ప్రేక్షకులందరూ చెప్పడమే పెద్ద అవార్డ్ గా భావిస్తున్నానని అన్నది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి సగటు ప్రేక్షకురాలిగా తాను ఎగ్జైటింగ్ గా ఫీలయ్యానని సాయిపల్లవి చెప్పింది. ఈ సినిమాకు గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాళీవెంకట్, ఆర్ఎస్ శివాజీ కీలక పాత్రలను పోషించారు.
సంబంధిత కథనం
టాపిక్