Prakash Raj | పునీత్ సేవలను కొనసాగిస్తానని ప్రకాశ్ రాజ్ ప్రకటన
పునీత్ రాజ్కుమార్ సేవలను తాను ముందుడి నడిపిస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. తన పేరుపై ఉన్న ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
నటుడు ప్రకాశ్ రాజ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఇప్పటికే కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శనివారం కీలక ప్రకటన చేశారు. కన్నడ నటుడు దివంగత పునీత్ రాజ్కుమార్ సేవలను తాను ముందుడి నడిపిస్తానని స్పష్టం చేశారు. తన పేరుపై ఉన్న ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు అప్పూ ఫొటోతో కూడిన ఓ పోస్టర్ను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
నా పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేయడాన్ని ఎంతో సంతోషిస్తున్నా. త్వరలోనే వివరాలను తెలియజేస్తా. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ చొరవతో జీవితాన్ని తిరిగి ఇద్దాం అని అప్పూ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోపై అప్పూ ఎక్స్ ప్రెస్ అని రాసి ఉండటం గమనార్హం.
ఈ పోస్ట్పై సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. తమ కామెంట్ల రూపంలో ప్రకాశ్ రాజ్ను అభినందిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ తన ఫౌండేషన్ ద్వారా కోవిడ్ సమయంలో ఎంతోమందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా తెలంగాణలో ఓ గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు.
పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబరు 29న గుండెపోటుతో హఠన్మరణం చెందారు. ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా ఆపన్నహస్తం అందించారు. ఇటీవలే ఆయన చివరి చిత్రం జేమ్స్ విడుదలైంది.
సంబంధిత కథనం
టాపిక్