Dasara Trailer: నాని దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. జాతర షురూ అయ్యేది అప్పుడే-nani movie dasara trailer will release on 2023 march 14 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Movie Dasara Trailer Will Release On 2023 March 14

Dasara Trailer: నాని దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. జాతర షురూ అయ్యేది అప్పుడే

Maragani Govardhan HT Telugu
Mar 11, 2023 08:47 PM IST

Dasara Trailer: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన అప్డేట్‌ను నాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

నాని దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
నాని దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్

Dasara Trailer: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అతడు నటించిన తాజా చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షుకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

దసరా మూవీ ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు హీరో నాని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. "జాతర షురూ" అంటూ ట్వీట్ చేశాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల ట్రైలర్లను కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ఎరుపు రంగు చొక్కా, లుుంగీ కట్టుకున్న నాని చేతిలో రెండు గొడ్డళ్లతో నిలబడాడు. ఎదురుగా 10 తలల రావాణాసురుడి బొమ్మను తగులబెడుతున్నట్లున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఇప్పటికే మూవీ ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. నాని నార్త్‌పై ఫోకస్ పెట్టి అక్కడ విరివిగా ఇంటర్వ్యూలు, ఈవెంటల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీజర్‌పై కూడా మంచి స్పందన వచ్చింది. నాని ఇటీవల మాట్లాడుతూ.. తను నటించిన దసరా మూవీ బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సరసన నిలుస్తుందని తెలిపాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్