Biggboss 6 telugu: నో ఎలిమినేషన్ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ - కంటెస్టెంట్స్ అందరూ సేఫ్
Biggboss 6 telugu : బిగ్బాస్ ఫస్ట్వీక్లో నో ఎలిమినేషన్ అని ప్రకటించి కంటెస్టెంట్స్తో పాటు అభిమానులను సర్ప్రైజ్ చేశాడు నాగార్జున.ఈ వారం ఎలిమినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
Biggboss 6 telugu :బిగ్బాస్ ఫస్ట్వీక్లో నో ఎలిమినేషన్ అని ప్రకటించారు హోస్ట్ నాగార్జున(Nagarjuna). చివరి వరకు ఈ విషయాన్ని సస్పెన్స్లో ఉంచుతూ కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించిన నాగార్జున ఎపిసోడ్ చివరలో అందరూ సేఫ్ అని ప్రకటించారు. మొదటివారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నిలవగా ఐదుగురు వివిధ టాస్క్లలో సేఫ్ అయ్యారు. చివరి రౌండ్లో అభినయశ్రీ, ఇనయా సుల్తానా మిగిలారు. వారిలో గార్డెన్ ఏరియాలో హమ్మర్ ఉంచి అది లేపిన వారు సేఫ్ అని నాగార్జున ప్రకటించారు.
అభినయశ్రీ, ఇనయా సుల్తానా హమ్మర్ లేపడంతో ఇద్దరిని సేఫ్ అని ప్రకటించారు. హౌస్లో కంటెస్టెంట్స్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు కాబట్టి బిగ్బాస్ సీజన్ 6 కోసం ప్రత్యేకంగా ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు.
అంతకుముందు బిగ్బాస్ కంటెస్టెంట్ కోసం ఎవరికి ఎంత తెలుసు అనే క్విజ్ గేమ్ నిర్వహించాడు నాగార్జున. హౌజ్లోని కంటెస్టెంట్స్ గురించి పలు ప్రశ్నలు అడిగారు. శ్రీసత్య శరీరంపై ఎన్ని టాటూలు ఉన్నాయి? రేవంత్ మదర్ పేరు ఏమిటి? గీతూ రాయల్ ఫాదర్ పేరు? ఫైమా లవర్ ఎవరు? ఇలా పలు ప్రశ్నలు ఆడిగాడు.(Biggboss 6 telugu )
ఈ గేమ్లో బాలాదిత్య, అర్జున్ కళ్యాణ్ సమానమైన పాయింట్లతో ఆధిక్యంలో నిలిచారు. వీరిద్దరికి మధ్య జరిగిన పోటీలో బాలాదిత్య గెలిచి స్టార్ ఆఫ్ ది వీక్ అవార్డు అందుకున్నాడు. అతడికి బిగ్ బాస్ ప్రత్యేకమైన బహుమతిని అందజేశాడు. ఈ క్విజ్ మధ్యలో ఇచ్చిన బ్యాటన్ టాస్క్ లో ఎలిమినేషన్ నుండి ఫైమా సేఫ్ అయ్యింది.
ఆ తర్వాత కొన్ని వస్తువులను చూపిస్తూ ఆ పదాలతో వచ్చే పాటలను పాడే పోటీని పెట్టారు. ఇందుకోసం కంటెస్టెంట్స్ను రెండు టీమ్లుగా విభజించారు. ఇందులో రేవంత్, చంటి, నేహా, అభినయశ్రీ, అర్జున్, రోహిత్ మరీనా, కీర్తి భట్, ఇనయా, షానీ ఏ టీమ్ గా ఉండగా ఫైమా, అర్జున్ కళ్యాణ్, సుదీప, గీతూరాయల్ తో పాటు మిగిలిన వారు బీ టీమ్ లో ఉన్నారు.
ఇందులో ఏ టీమ్ గెలిచింది. ఆ తర్వాత ఇచ్చిన నంబర్స్ టాస్క్లో రేవంత్ సేఫ్ అయ్యాడు. అరోహి, ఇనయా, అభినయశ్రీలకు ఇచ్చిన కంప్టైంట్ టాస్క్ లో అరోహి సేఫ్ అయ్యింది. ఈ టాస్క్ లో అత్యధిక కంప్లైంట్స్ ఇనయాపైనే రావడంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. చివరలో అభినయశ్రీ, ఇనయా మిగలగా హమ్మర్ టాస్క్ లో ఇద్దరు సేఫ్ అని నాగార్జున ప్రకటించారు.