Mahesh Babu | కళావతి సాంగ్ అరుదైన ఘనత.. యూట్యూబ్లో రికార్డు వీక్షణలు
మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ అరుదైన రికార్డు దక్కించుకుంది. యూట్యూబ్లో ఈ పాట 150 మిలియన్ల వ్యూస్ను అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 13న విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టైటిల్ సాంగ్ సహా నాలుగు పాటలు విడుదలయ్యాయి. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టయ్యాయి. ముఖ్యంగా కళావతి సాంగ్ శ్రోతలను విపరీతంగా అలరిస్తోంది. యూట్యూబ్లో రికార్డు వీక్షణలతో దూసుకెళ్తోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ఏడాది విడుదలైన ఈ పాట కుర్రకారుకు విపరీతంగా నచ్చేసింది.
విడుదలైనప్పటి నుంచి చాలా రోజుల పాటు ట్రెండింగ్గా నిలిచిన ఈ పాట ఇప్పటికే 150 మిలియన్ల వీక్షణలను(view) అందుకుని దూసుకెళ్తోంది. "వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే ఈ మాయ, కమ్మాన్ కమ్మాన్.. కళావత.. నువ్వే లేకుంటే అధోగతి" అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటకు సాహిత్యాన్ని అనంత శ్రీరామ్ అందించారు. ఉత్సాహంతో మెలోడియస్గా ఆకట్టుకునే ఈ పాటకు జనాదారణ రోజురోజుకు ఎక్కువవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇటీవలే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయింది. చివరగా ఓ మహేశ్, కీర్తి సురేశ్పై ఓ సాంగ్ను తెరకెక్కించి గుమ్మడి కాయ కొట్టేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సాంగ్ సహా.. ట్రైలర్ను కూడా విడుదల చేయనుంది చిత్రబృందం.
సంబంధిత కథనం
టాపిక్