Krishna Mukunda Murari May 5th Episode: కృష్ణను క్షమించిన మురారి - భవానీ మనసు మార్చేందుకు ముకుంద ప్రయత్నం
Krishna Mukunda Murari May 5th Episode: మురారిని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపపడుతుంది కృష్ణ. కన్నీళ్లతోనే అతడిని క్షమాపణలు కోరుతుంది. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందంటే...
Krishna Mukunda Murari May 5th Episode: తన తండ్రిని చంపింది మురారి అని అపార్థం చేసుకున్న కృష్ణ అతడిని మాటలతోనే చాలా సార్లు బాధ పెడుతోంది. కొడుకు అనారోగ్య సమస్యల కారణంగా తన హాస్పిటల్లోనే చేరిన అంజి బాబాయ్ ద్వారా అసలు నిజం ఏమిటన్నది ఆమెకు తెలుస్తుంది. తండ్రి మరణానికి మురారి కారణం కాదనే విషయం ఆమెకు అర్థమవుతుంది. దాంతో మురారి విషయంలో తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్న కృష్ణ మొకాళ్ల ద్వారా గుడి మెట్లు ఎక్కుతుంది.
కృష్ణను క్షమించిన మురారి
ఆమె మొకాళ్ల ద్వారా గుడి మెట్లు ఎక్కడం చూసి మురారి కంగారు పడతాడు. ఇంత కఠినమైన మొక్కు అవసరమా అంటూ ఆమెను ప్రాధేయపడతాడు. కానీ కృష్ణ మాత్రం అతడి మాట వినదు. మురారి కాళ్లపై పడి తన తప్పుకు మౌనంగానే క్షమాపణలు కోరుతుంది. కన్నీళ్లతో పశ్చాత్తాపపడుతుంది. ఆమె కన్నీళ్లను చూసి మురారి కరిగిపోతాడు. ఇద్దరు కలిసి దేవుడి దర్శనం చేసుకుంటారు.
ఆ తర్వాత మురారి తనను పెద్దమ్మ పదే పదే పిలిచినట్లుగా అనిపించడంతో ఒత్తిడికిలోనై సోఫాలో కళ్లు తిరిగిపడిపోబోతుంది భవానీ. ఆమెను సేవ్ చేయడానికి వస్తుంది ముకుంద. మురారికి దూరం పెట్టినందుకు భవానీ అలా అయిపోతుందని ముకుంద భావిస్తుంటుంది. అదే మాటను ఆమెతో చెబుతుంది. అందుకు కృష్ణనే కారణం ఆడిపోసుకుంటుంది. కృష్ణ వల్లే మీ పెద్దరికానికి ముప్పు వచ్చింది, మీ మనశ్శాంతి కరువైంది అంటుంది.
మురారి నాటకం..
మీ ఎదురుగా ఉంటూ మీ వింటున్నట్లు నటిస్తూ మురారి చేయాల్సింది చేశాడు అంటూ అతడిపై కోపాన్ని ప్రదర్శిస్తుంది. కృష్ణ వల్ల ఇంట్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయని? అంటూ భవానీతో అంటుంది. కృష్ణ వల్లే మీరు ఒంటరిగా మారిపోయారని, ఆమెను ఇంటి నుంచి బహిష్కరించడమే పరిష్కారమని చెబుతుంది.
కానీ ఆమె మాటలతో భవానీ అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. కృష్ణ ఉండటం వల్ల నీకు సమస్య ఏమిటంటూ ముకుందపై కోపాన్ని వ్యక్తం చేస్తుంది. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఆమెతో అంటుంది. భవానీ మాటలతో ముకుంద అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అయిష్టాలు ఇష్టంగా...
గుడి నుంచి నేరుగా లంచ్ చేయడానికి రెస్టారెంట్ వెళతారు కృష్ణ, మురారి. ఇద్దరు ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ చాలా సేపు ఉండిపోతారు. ఏం తినాలని ఉందని కృష్ణను అడుగుతాడు మురారి. మీకు ఇష్టమైనదే అంటుంది. నాకేం గుర్తులేదని మురారి అనగా కపుల్ స్వీట్ అని సమాధానం చెబుతుంది. ఆమె మాట విని మురారి ఆశ్చర్యపోతాడు. నా ఇష్టాలన్నీ నీకు అయిష్టాలు కదా అంటాడు.
అందుకు అది ఒకప్పుడు అంటూ కృష్ణ సమాధానం చెబుతుంది. మొకాళ్ల మీద గుడి మెట్లు ఎక్కడానికి కారణమేమిటని కృష్ణను అడుగుతాడు. కానీ కృష్ణ మాత్రం తండ్రి మరణం గురించి తనకు తెలిసిన నిజాన్ని అతడికి చెప్పదు. ఆలస్యంగా అయినా ఓ నిజాన్ని తెలుసుకున్నానని, మబ్బులు వీడిపోయి మనసు నిశ్చలంగా మారిపోయిందని సమాధానం దాటవేస్తుంది.
ఆమె మాటలు విని ఈ రోజు నువ్వు వింతగా మాట్లాడుతున్నావంటూ మురారి అంటాడు. వెయిటర్ ఇచ్చిన కపుల్ స్వీట్ను ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది.