Keerthi Suresh in Vacation: వెకేషన్లో కీర్తి సురేష్.. నూతన సంవత్సరం కోసం సరికొత్త ప్లాన్
Keerthi Suresh in Vacation: టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ వెకేషన్లో ఉంది. మాల్దీవులు కాకుండా సరికొత్త పర్యాటక ప్రదేశంలో ఈ ముద్దుగుమ్మ చిల్ అవుతోంది. థాయ్లాండ్లోని ఓ ఐలాండ్లో ఈ ముద్దుగుమ్మ సేద తీరుతోంది.
Keerthi Suresh in Vacation: క్రిస్మస్ సీజన్ వచ్చిందంటేనే.. మన సెలబ్రెటీలు హాలీడేకు ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా నూతన ఏడాది కూడా దగ్గర్లో ఉండటంతో రెండింటిని కలిపి భారీ వెకేషన్ను సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నటి కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సూరేష్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తోంది.
ప్రస్తుతం కీర్తి థాయ్లాండ్లో చిల్ అవుతోంది. నటీ మణుల్లో ఎక్కువ మంది విహారయాత్ర కోసం మాల్దీవులను ఎంచుకుంటే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం థాయ్లాండ్కు ఓటేసింది. క్రౌడ్ ఎక్కువగా ఉండే పర్యాటక ప్రదేశాలను కాదని.. బ్యాంకాక్, ఫుకెట్ ఐలాండ్స్ లాంటి వైవిధ్యమైన ప్రదేశాలకు ఓటేసింది. ఈ నూతన సంవత్సరాన్ని థాయ్లాండ్ తూర్పు తీరంలో ఉన్న కో సామూయ్ ద్వీపాన్ని ఎంచుకుంది. థాయ్లాండ్లోని అతిపెద్ద ద్వీపాల్లో కో సామూయ్ ఒకటి.
ఈ దీవిలో కీర్తి సురేష్ చిల్ అవుతోంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న రిసార్ట్ను తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా అక్కడి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. పెద్దగా రద్దీ లేని ప్రాంతాన్ని తాను ఎంచుకున్నట్లు ఇంతకుముందే తెలిపింది కీర్తి. కో సామూయ్ విమానాశ్రయం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొంది.
వర్క్ విషయానికొస్తే తెలుగుతో పాటు తమిళంలోనూ ఫుల్ బిజీగా ఉంది కీర్తి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో పాటు తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో నాని సరసన దసరా చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్