Chiranjeevi Voice Over To Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్కు చిరంజీవి వాయిస్ ఓవర్
Chiranjeevi Voice Over To Ponniyin Selvan: విలక్షణ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్లో చిరంజీవి భాగమైనట్లు సమాచారం. ఈ సినిమాలో చిరు ఎలా భాగమయ్యారంటే...
Chiranjeevi Voice Over To Ponniyin Selvan: ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో దేశవ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్పై ఎక్కువగా క్రేజ్ ఉంది. చారిత్రక కథాంశంతో విలక్షణ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించాడు. విక్రమ్(Vikram), జయంరవి, ఐశ్వర్యరాయ్(Aiswarya RAI), కార్తి, త్రిష(Trisha)తో పాటు తమిళ చిత్రసీమకు చెందిన పలువురు అగ్రనటీనటులు ఈ సినిమాలో నటించారు. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం వివిధ భాషల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్కు అగ్ర హీరో చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సమాచారం. చిరంజీవి వాయిస్తోనే పొన్నియన్ సెల్వన్ సినిమా మొదలవుతుందని సమాచారం. పాత్రల పరిచయానికి సంబంధించిన సీన్స్లో చిరు వాయిస్ వినిపించనున్నట్లు చెబుతున్నారు. చిరు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని మేకర్స్ మాత్రం వెల్లడించలేదు. థియేటర్ల లో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలనే సీక్రెట్గా ఉంచినట్లు తెలిసింది.
నెల రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో మణిరత్నం(Maniratnam) ప్రత్యేకంగా చిరంజీవికి థాంక్స్ చెప్పారు. చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పడానికి కారణం ఇదేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళంలో కమల్హాసన్(Kmalahaasan), మలయాళంలో మమ్ముట్టి, కన్నడంలో ఉపేంద్ర(Upendra), హిందీలో అజయ్ దేవ్గణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలిసింది.
కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజరాజ చోళ పాలనలో చోటుచేసుకున్న కుట్రలు, కుతంత్రాల్ని పొన్నియన్ సెల్వన్ లో చూపించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.