Bigg Boss 6 Telugu Episode 29: ఆరోహి ఎలిమినేట్ - గీతూపై నాగ్ ఫైర్
Bigg Boss 6 Telugu Episode 29: బిగ్బాస్ నాలుగో వారం నుంచి ఆరోహి ఎలిమినేట్ అయ్యింది. ఆరోహి ఎలిమినేట్ కావడంతో సూర్య ఎమోషనల్ అయ్యాడు. గీతూపై నాగార్జున సీరియస్ అయ్యాడు.
Bigg Boss 6 Telugu Episode 29: ఈ వారం ఎవరూ ఊహించని విధంగా ఆరోహి బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సూర్య, చంటి, రాజ్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ వారిని సేవ్ చేసిన బిగ్బాస్ ఆరోహి ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఆరోహి హౌజ్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో సూర్య ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. కీర్తి, ఇనాయా కూడా ఆరోహి వెళ్లిపోతుండటంతో ఏడుస్తూ కనిపించారు.
అంతకుముందు ఈ వీకెండ్ ఎపిసోడ్ను దసరా స్పెషల్గా ప్రకటించాడు నాగార్జున. టాస్క్లతో కాకుండా సేవ్ చేయడంతోనే ఈ ఎపిసోడ్ను ప్రారంభించాడు. కొబ్బరికాయల టాస్క్ ఇచ్చాడు. ఈ సారి నామినేషన్స్లో కీర్తి, శ్రీహాన్, గీతూ, రేవంత్, అర్జున్ కళ్యాణ్, సూర్య, రాజ్, ఆరోహి, సుదీప, ఇనాయా నిలవగా ఫస్ట్ టాస్క్లో శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. సిరి...శ్రీహాన్ సేఫ్ అంటూ నాగార్జున అనౌన్స్ చేశాడు.
గీతూపై నాగ్ ఫైర్...
పండుగ చేసుకోవాలంటే మనసులో బాధ క్లియర్ చేసుకోవాలని అన్నాడు. కెమెరా కోసం కీర్తి పనిచేస్తుందంటూ చంటి తనను అన్న మాటలు నిజమో కాదో తెలుసుకోవాలని ఉందంటూ కీర్తి చెప్పింది. ఈ మాట చంటి అన్నట్లుగా గీతూ తనతో చెప్పిందని కీర్తి పేర్కొన్నది. పాత వీడియోను నాగార్జున చూపించాడు. అందులో చంటి అన్న మాటలను గీతూ తప్పుగా అర్థం చేసుకోవడంపై నాగార్జున సీరియస్ అయ్యాడు.
కీర్తితో మాట్లాడుతున్న సమయంలో గీతూ పదే పదే అడ్డుతగలడంతో నాగార్జున ఆమెపై ఫైర్ అయ్యాడు. ఆడియోన్స్ కూడా చంటి తప్పు చేయలేదని అన్నారు. ఈ విషయంలో ఓటింగ్ పెట్టగా చంటి నెగెటివ్ ఇంటెన్షన్తో ఈ మాట అన్నాడని గీతూ ఒక్కతే ఓటు వేసింది. చంటితో జరిగిన గొడవను గుర్తుచేసుకొని గీతూ కన్నీళ్లు పెట్టుకుంది. నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో తన తప్పు తెలుసుకున్న కీర్తి...చంటికి క్షమాపణలు చెప్పింది. గీతూను, చంటిని కలిపే బాధ్యతను బాలాదిత్య, ఫైమాలకు అప్పగించాడు నాగార్జున.
బిగ్బాస్ హౌజ్లో ది ఘోస్ట్ టీమ్
బిగ్బాస్హౌజ్లో ది ఘోస్ట్ టీమ్ సందడి చేశారు. సోనాల్ చౌహాన్, ప్రవీణ్ సత్తారు సందడి చేశారు. తెలుగులో బిగ్బాస్ తన ఫేవరేట్ షో అంటూ సోనాల్ చౌహాన్ పేర్కొన్నది. కంటెస్టెంట్స్తో ఘోస్ట్ గేమ్ ఆడించారు నాగార్జున. హౌజ్లో ఈవిల్ ఎవరని అనుకుంటున్నారో వారిని షూట్ చేయాలని అన్నాడు. ఆ తర్వాత ఇచ్చిన పూల బుట్టల టాస్క్లో ఇనాయా సేఫ్ అయ్యింది.
జిలేబీ టాస్క్లో శ్రీసత్య విన్...
కంటెస్టెంట్స్ను బాయ్స్, గర్ల్స్ టీమ్గా విడగొట్టిన నాగార్జున వారితో డిఫరెంట్ గేమ్స్ ఆడించాడు. తొలుత బెలూన్ గేమ్లో ఆరోహి, అర్జున్ పోటీపడ్డారు. ఇందులో ఆరోహి గెలిచింది. పూలబుట్టల గేమ్ ఆడించాడు. ఇందులో అమ్మాయిల టీమ్ గెలిచారు. ఆ తర్వాత జిలేబీ టాస్క్లో శ్రీసత్య విజయాన్ని అందుకున్నది.
మేకప్ టాస్క్లో వాసంతి గెలిపించింది. మొత్తంగా ఈ గేమ్లో అమ్మాయిలు గెలిచినట్లు నాగార్జున ప్రకటించాడు. మొత్తం ఆ తర్వాత ఇచ్చిన గంట టాస్క్లో గీతూ, మిఠాయి టాస్క్లో సూర్య సేఫ్ అయ్యాడు. కంటెస్టెంట్స్తో బతుకమ్మ ఆడించాడు నాగార్జున. పాటలకు అమ్మాయిలు, అబ్బాయిలు డ్యాన్స్ చేశారు.
అమ్మాయిలు,అబ్బాయిలకు మధ్య డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టాడు. నెక్స్ట్ మిఠాయి లడ్డు టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో స్వీట్ లడ్డు, బిట్టర్ లడ్డు ఇచ్చి ఎవరికి ఏది తెనిపించాలని అనుకుంటున్నారో రీజన్ చెప్పి తినిపించమని చెప్పాడు. కంటెస్టెంట్స్ వివిధ రీజన్స్ చెప్పారు.ఆ తర్వాత పాలపిట్ట టాస్క్లో కీర్తి, అర్జున్ సేఫ్ అయ్యారు. కంటెస్టెంట్స్కు బలపరీక్ష టాస్క్ పెట్టాడు. నెక్స్ట్ టాస్క్లో రాజ్ సేఫ్ అయ్యాడు. చివరలో సుదీప, ఆరోహి నామినేషన్స్లో మిగిలారు. వారిలో కుండ టాస్క్లో ఆరోహి ఎలిమినేట్ అయ్యినట్లు నాగార్జున ప్రకటించాడు.
ఆరోహి ఎలిమినేట్
ఆరోహి ఎలిమినేట్ అవుతుందని తెలియగానే సూర్య కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయినా ఏడుస్తూనే కనిపించాడు. అందరూ ఎమోషనల్ అవ్వడంతో పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నట్లుగా ఉందని ఆరోహి చెప్పింది. హౌజ్లో శ్రీహాన్తో బాగా కనెక్ట్ అయ్యాడు. స్టేజ్పైకి వచ్చిన ఆరోహికి స్వచ్ఛం, కల్మషం టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో బాలాదిత్య, శ్రీహాన్, ఆర్జే సూర్య, కీర్తి, వాసంతి, రోహిత్- మరీనా స్వచ్ఛం అని ప్రకటించింది. రేవంత్, గీతూ, చంటి, సుదీప, శ్రీసత్య, ఇనాయాలకు కల్మషం టాస్క్ ఇచ్చింది.