Anasuya Bharadwaj: ఆంథాలజీ సినిమాలో అనసూయ లీడ్ రోల్...డిఫరెంట్ టైటిల్ ఫిక్స్...
పుష్ప, రంగస్థలంతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించి మెప్పించింది అనసూయ భరద్వాజ్(anasuya bharadwaj). యాంకర్ ఓ వైపు బిజీగా ఉంటూనే సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె మరో కొత్త పాత్రలో కనిపించదోతున్నది. ఆ సినిమా ఏదంటే...
యాంకర్గా అనసూయ ఫుల్ బిజీగా ఉంది. పలు షోలకు హోస్ట్గా వ్యవహరిస్తోంది. బుల్లితెరపై తీరిక లేకుండా ఉన్నా వెండితెరకు మాత్రం దూరం కావడం లేదు. పుష్ప, రంగస్థలం, ఖిలాడీతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్లో కనిపించి మెప్పించింది అనసూయ. ఆమెను దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు కొత్త తరహా క్యారెక్టర్స్ను సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో విభిన్నమైన పాత్రలో అనసూయ కనిపించబోతున్నది.
పేపర్బాయ్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయమయ్యారు జయశంకర్. తాజాగా ఆయన ఓ అంథాలజీ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రానికి అరి అనే టైటిల్ ను ఖరారు చేశారు. శుక్రవారం టైటిల్ లోగోను రివీల్ చేశారు. ఆరు కథల సమాహారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. గత చిత్రాలకు భిన్నంగా ఛాలెంజింగ్ పాత్రలో అనసూయ కనిపించనున్నట్లు చెబుతున్నారు.
ఈ సినిమాలో అనసూయతో పాటు సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్వీరెడ్డి, శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరి చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప(pushpa) సీక్వెల్ లో దాక్షయణిగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా పక్కా కమర్షియల్, కృష్ణవంశీ రంగమార్తండ లో అనసూయ కీలక పాత్రలను పోషిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్