Stock market news today : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- నిఫ్టీ 70 పాయింట్లు డౌన్
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టపోయాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు కోల్పోయి 62,558వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 77 పాయింట్ల నష్టంతో 18,625 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు లోనై.. చివరికి ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34 పాయింట్ల నష్టంతో 62,835 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద ముగిసింది. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62396- 18601 వద్ద మొదలుపెట్టాయి.
పివోట్ ఛార్ట్స్ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్ 18,621- 18,589 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్ 18,726- 18,758 వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 112, టార్గెట్ రూ. 122
- డీఎల్ఎఫ్:- బై రూ. 418, స్టాప్ లాస్ రూ. 415, టార్గెట్ రూ. 430
- రిలయన్స్ ఇండస్ట్రీస్:- సెల్ కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2677, టార్గెట్ రూ. 2,652
- అదానీ ఎంటర్ప్రైజెస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ 3936, టార్గెట్ రూ. 4,049
లాభాలు.. నష్టాలు..
ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్టెల్, పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్సీఎల్ టెక్, టెక్ఎం, ఇన్ఫీ, ఏషియన్ పెయింట్స్, కొటాక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
US Stock markets : అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ 1.4శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.79శాతం, నాస్డాక్ 1.93శాతం మేర నష్టాలు చూశాయి. ఆర్థిక వ్యవస్థ డేటా సానుకూలంగా వస్తుండటంతో.. వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను ఫెడ్ తగ్గించకపోవచ్చన్న భయం మదుపర్లలో నెలకొంది.
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పవనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.23శాతం, ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.28శాతం పతనమయ్యాయి. సౌత్ కొరియా కాస్పి 1శాతం మేర నష్టాల్లో ఉంది.
చమురు ధరలు..
చమురు ధరలు 3శాతం పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ 2.89డాలర్ల పతనమై.. 82.68డాలర్లకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
India stock markets : సోమవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 1139.07 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు ఎఫ్ఐఐలు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 2607.98కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.