Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 12 పాయింట్లు లాభం!-stock market news today 4 november 2022 sensex nifty open flat ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 4 November 2022, Sensex Nifty Open Flat

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 12 పాయింట్లు లాభం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 04, 2022 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా మొదలుపెట్టాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 52 పాయింట్ల లాభంతో 60,888 వద్ద కొనసాగుతోంది. 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 18,065 వద్ద ట్రేడ్​ అవుతోంది.

బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 69పాయింట్ల నష్టంతో 60,836 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 151 పాయింట్లు వృద్ధిచెంది 41,298 వద్దకు చేరింది. మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను.. సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60698-18053 వద్ద ప్రారంభించాయి.

పివొట ఛార్ట్​ ప్రకారం.. 17,983-17,948 లెవల్స్​ వద్ద నిఫ్టీ సపోర్టు ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,095- 18,130 వద్ద రెసిస్టెన్స్​ ఉంది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. మదుపర్లు 'బై ఆన్​ డిప్​' స్ట్రాటజీని అమలు చేయవచ్చు. రిసిస్టెన్స్​ను బ్రేక్​ చేస్తే.. ఇంకా పైకి వెళ్లొచ్చు. ఈ లెవల్​ వద్ద మార్కెట్​ను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy today : ఫెడరల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 132, టార్గెట్​ రూ. 145
  • యూపీఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 710, టార్గెట్​ రూ. 745- 750

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​, డా. రెడ్డీస్​, ఎం అండ్​ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎయిర్​టెల్​, విప్రో, హెచ్​యూఎల్​, ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

America stock markets : అమెరికా స్టాక్​ మార్కెట్లు.. వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్​ చేసిన వ్యాఖ్యలు.. మదుపర్లలో మళ్లీ భయాలను తీసుకొచ్చాయి. డౌ జోన్స్​ 0.46శాతం, నాస్​డాక్​ 1.73శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.06శాతం మేర నష్టపోయాయి. అమెరికా అక్టోబర్​ జాబ్స్​ డేటా నేడు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు మరింత అప్రమత్తత వ్యవహరించారు.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 2శాతం మేర పతనమైంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.3శాతం పెరిగింది. సౌత్​ కొరియా కాస్పి 0.3శాతం వృద్ధిచెందింది.

త్రైమాసిక ఫలితాలు..

బ్రిటానియా, సిప్లా, టైటాన్​, గెయిల్​, ఇండిగో, ఆదిత్యా బిర్లా ఫ్యాషన్​ అండ్​ రీటైల్​, సిటీ యూనియన్​ బ్యాంక్​, కమ్మిన్స్​ ఇండియా, ఎస్కార్ట్స్​ క్యుబోటా, గో ఫ్యాషన్​, మహీంద్ర లాజిస్టిక్స్​, మారికో, టీవీఎస్​ సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 677.62కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 732.11కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

WhatsApp channel

సంబంధిత కథనం