Gold and silver rates today : భారీగా పెరిగిన పసిడి ధరలు.. నేటి లెక్కలివే-gold and silver rates today check latest price in hyderabad and vijayawada other cities ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Rates Today, Check Latest Price In Hyderabad And Vijayawada Other Cities

Gold and silver rates today : భారీగా పెరిగిన పసిడి ధరలు.. నేటి లెక్కలివే

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 06:05 AM IST

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 750 పెరిగి.. రూ. 48,750కి చేరింది. గురువారం ఈ ధర రూ. 48,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7,500 పెరిగి, రూ. 4,87,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 4,875గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 820 వృద్ధి చెంది.. రూ. 53,180కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 52,360గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 8,200 పెరిగి.. రూ. 5,31,800గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 53,180గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,000గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 48,780గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 53,210గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,180గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,800గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 53,230గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,750గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,180గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,200గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 62,000కి చేరింది. గురువారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 67,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 62,000.. బెంగళూరులో రూ. 67,200గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 310 తగ్గి.. రూ 26,170కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,480గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,170గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం