Gold and silver rates today : స్థిరంగా పసిడి, తగ్గిన వెండి ధరలు.. నేటి లెక్కలివే
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు తగ్గాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 52,000గా కొనసాగుతోంది. గురువారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,20,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 5,200గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 56,730గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,67,300గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5,673గా ఉంది.
Gold price today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,890గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 52,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 56,730గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,900గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,710గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 52,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 56,730గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,730గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 56,780గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 52,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,730గా ఉంది.
ద్రవ్యోల్బణం,ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,190గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 300 తగ్గి.. రూ. 71,900కి చేరింది. గురువారం ఈ ధర రూ. 72,200గా ఉండేది.
Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 73,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 72,200.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 10 తగ్గి.. రూ. 27,190కి చేరింది. ఆ ముందు రోజు ధర రూ. 27,200గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,190గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం