మాయ మాటలు చెప్పాడు.. అంధ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు!
అంధ యువతిపై కన్నేశాడు. ఎలాగైనా కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.ఇందుకోసం మాయ మాటలు చెప్పాడు. బుట్టలో వేసుకున్నాడు. అనుకున్నట్లే కోరిక తీర్చుకున్నాడు. ఈ బాగోతం ఎట్టకేలకు బయటపడింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అంధ యువతిపై వివాహితుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో.. ఇతగాడి బాగోతం బయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు
చిత్తూరు నగరంలో బాధిత అంధ యువతి కుటుంబం నివాసం ఉంటోంది. యువతి తండ్రి చాలాకాలం కిందట మృతి చెందాడు. వీరి నివాసం దగ్గర్లోనే ఉంటున్న.. ఓ రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు జయచంద్రా రెడ్డి అలియాస్ చిన్నా.. కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అంధ యువతిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పడం స్టార్ట్ చేశాడు. అనుకున్నట్లే బుట్టలో వేసుకుని.. పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు. ఈ వ్యవహారం బాధితురాలి తల్లికి చేరటంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి విజ్ఞప్తి చేస్తున్నారు. నిందితుడి తండ్రి పోలీసు శాఖకు చెందినవారు కావడంతో.. కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును నిష్పాక్షపాతంగా విచారణ జరిపి.. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.