Special Status : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం… పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ-no special category status for andhra pradesh union government anounces in parliament ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Status : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం… పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ

Special Status : ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం… పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ

HT Telugu Desk HT Telugu
Dec 13, 2022 07:16 AM IST

Special Status ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మరోసారి తేల్చి చెప్పింది. దేశంలో ప్రస్తుతం ప్రత్యక హోదా ఉనికిలో లేదని ప్రకటించింది. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని మరోసారి తేల్చిన కేంద్ర ప్రభుత్వం
ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని మరోసారి తేల్చిన కేంద్ర ప్రభుత్వం (PTI)

Special Status ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికిి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా దేశంలో ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలోవైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దేశంలో ''వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల వల్ల గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రం పార్లమెంటులో వివరించింది.

ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధుల పంపిణీకి 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుందని, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రాలకుా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని వివరించారు.

నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని, నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోందని అని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా హోదా అనే ప్రశ్న ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.

గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమే..

ముందుగా నిర్ణయించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం కష్టమేననిని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని వైకాపా ఎంపీ ప్రశ్నించారు. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ కారణాల దృష్ట్యా గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు.

బాకీ రూ. 2,441.86 కోట్లు మాత్రమే..

''పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.6,461.88 కోట్లను ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ. 29,027.95 కోట్లుగా ఉందని, ఆ తర్వాత 2017-18 అంచనాల ప్రకారం రూ. 47,725.74 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను మాత్రమే కేంద్రం తిరిగి చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లు అయితే అందులో ఇప్పటికే రూ. 13,226.04 కోట్లు ఏపీ ప్రభుత్వానికి చెల్లించారని, రాష్ట్రానికి చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ. 2,441.86 కోట్లు మాత్రమే ఉందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం ఇచ్చారు.

IPL_Entry_Point