AICC Polling : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఉత్సాహంగా పోలింగ్
- ఎఐసిసి అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో సభ్యులు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు. అధ్యక్ష పోటీలో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ తలపడుతున్నారు. భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చి పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నాయకుల కోసం కర్నూలు జిల్లా కార్యాలయంలో పోలింగ్ ఏర్పాటు చేశారు. ఎపిసిసి సభ్యులు 350 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఓటు వేసేందుకు పిసిసి ప్రతినిధులుగా ఇద్దరికి అవకాశం కల్పించారు. ఓటింగ్ కోసం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎపిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ తో పాటు పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్తో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- ఎఐసిసి అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో సభ్యులు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు. అధ్యక్ష పోటీలో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ తలపడుతున్నారు. భారత్ జోడో యాత్రకు విరామం ఇచ్చి పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నాయకుల కోసం కర్నూలు జిల్లా కార్యాలయంలో పోలింగ్ ఏర్పాటు చేశారు. ఎపిసిసి సభ్యులు 350 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఓటు వేసేందుకు పిసిసి ప్రతినిధులుగా ఇద్దరికి అవకాశం కల్పించారు. ఓటింగ్ కోసం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎపిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ తో పాటు పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్తో పాటు పలువురు నేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇతర గ్యాలరీలు