AP BRS : ఏపీలో పర్యటించనున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్-andhra pradesh brs president thota chandra sekhar tour in guntur and meets with party leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Brs President Thota Chandra Sekhar Tour In Guntur And Meets With Party Leaders

AP BRS : ఏపీలో పర్యటించనున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 06:21 AM IST

AP BRS ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్ విస్తరణపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో నిర్వహించే మహా మృత్యుంజయ జప (దోష) విశ్వశాంతి మహాయాగానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

బిఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌
బిఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌

AP BRS ఆంధ్రప్రదేశ్‌ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంలో జరిగే భూమి పూజ మహోత్సవ శుభకార్యక్రమంలో పాల్గొంటారని బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ గుంటూరులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ముందుగా గన్నవరం విమానాశ్రయానికి తొమ్మిది గంటలకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్ పోర్టులో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు , కార్యకర్తలతో కలిసి గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం , ఉండవల్లి గ్రామంలోని దేవుని మాన్యంలోని పంట కాలువ ప్రక్కన ' శ్రీ గంగా బాలత్రిపురసుందరీదేవి సమేత భీమలింగేశ్వరస్వామి' వారి దివ్య ఆశీస్సులతో .... ' శ్రీశ్రీశ్రీ మహా మృత్యుంజయ జప ( దోష ) విశ్వశాంతి మహాయాగం ' కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ తోట చంద్రశేఖర్ పాల్గొంటారు.

ఆ తర్వాత తోట చంద్రశేఖర్ గుంటూరులో ఆయన బస చేయనున్నారు . గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో డాక్టర్ తోట చంద్రశేఖర్ సమావేశమవుతారు. పార్టీలో చేరికలు, తాజా రాజకీయ పరిణామాలు సహా ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలతో చంద్రశేఖర్‌ సమావేశం కానున్నారు. మరోవైపు బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలను అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో కూడా భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఖమ్మం, నాందేడ్‌ తరహాలో ఏపీలో కూడా బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. సభనిర్వహించే ప్రాంతంతో పాటు తేదీని ఆ పార్టీ ఖరారు చేయాల్సి ఉంది.

IPL_Entry_Point

టాపిక్