Sambar History: సాంబార్ పుట్టిన రాష్ట్రం ఇదే, దీనికి ఎవరి పేరు పెట్టారంటే…
- దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారో, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకోండి.
- దక్షిణాది వంటకాలలో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న వాటిలో సాంబార్ ఒకటి. తెలుగు భోజనాలలో సాంబార్ కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ భారతదేశంలో తొలిసారి సాంబారు ఎక్కడ తయారు చేశారో, దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకోండి.
(1 / 6)
దక్షిణ భారత వంటకాలలో సాంబార్ ఒకటి. దీనికి అభిమానులు ఎక్కువ. వివిధ రకాల మసాలా దినుసులను జోడించి తయారు చేసే సాంబార్ లేకుండా ఏ పెళ్లి విందు పూర్తి కాదు. సాంబార్ వెరీ స్పెషల్ వంటకంగా పేరు తెచ్చుకుంది.
(2 / 6)
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడి తినే సాంబార్ వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ వంటకం ఎండు మిరియాలు, పప్పు, చింతపండు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైన పదార్ధాలతో తయారు చేస్తారు. సాంబార్ ఆవిష్కరణ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
(3 / 6)
సాంబారును మొదట మహారాష్ట్రలో తయారు చేశారు. తంజావూరులో మరాఠా పాలనను స్థాపించిన ఏకోజీ కుమారుడు మొదటి షాహాజీ రాజపాకశాలలో మొదట సాంబారును తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది.
(4 / 6)
ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు,శంభాజీ తంజావూరును సందర్శించినప్పుడు, అతని కోసం ప్రత్యేకంగా సాంబార్ అనే వంటకాన్ని తొలిసారి వండినట్టు చెబుతారు. శంభాజీని ముద్దుగా సాంబా అని పిలుచుకుంటారు. ఈ కొత్త వంటకానికి అతని గౌరవార్థం అతని పేరునే పెట్టారు.
(5 / 6)
మరో కథనం ప్రకారం షాజీ అనే రాజ వంటగాడు పప్పు వండుతున్నాడు. పప్పులో వేసేందుకు కోకుమ్ లేకపోవడంతో… చింతపండును వేశారు. అలాగే కొన్ని కూరగాయలు కూడా జోడించాడు. ఈ లోపు శివాజీ కొడుకు శంభాజీ పర్యటనకు అక్కడికి వచ్చాడు. ఆ వాసన అతనికి బాగా నచ్చింది. అతడికి ఈ సాంబారును తొలిసారి వడ్డించినట్టు చరిత్ర చెబుతోంది.
ఇతర గ్యాలరీలు