Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్-తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
- Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు(ఏప్రిల్ 23) పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 9.30 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నారు. ఇవాళ జరగాల్సిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి.
- Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు(ఏప్రిల్ 23) పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 9.30 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నారు. ఇవాళ జరగాల్సిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి.
(1 / 6)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు(ఏప్రిల్ 23) పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 9.30 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నారు.
(2 / 6)
పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొనున్నారు. పవన్ కల్యాణ్ ర్యాలీ గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ నుంచి మొదలై పాద గయ క్షేత్రం వరకు సాగనుంది. అనంతరం పిఠాపురం ఎంపీడీవో ఆఫీసులో పవన్ నామినేషన్ వేయనున్నారు.
(3 / 6)
గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. ఈసారి పిఠాపురం బరిలో నిలబడ్డారు. పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తున్నారు.
(4 / 6)
పవన్ కల్యాణ్ వారాహి విజయ భేరి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం భీమవరం సభలో పాల్గొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభల్లో పాల్గొనాల్సి ఉండగా అవి వాయిదా పడ్డాయి.
(5 / 6)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు పర్యటన వాయిదా పడింది. పవన్ కల్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తింది. హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది.
ఇతర గ్యాలరీలు