(1 / 6)
ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ శ్రీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
(2 / 6)
ఈ సందర్భంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 20న హనుమంత వాహనం, ఏప్రిల్ 22న కల్యాణోత్సవం, ఏప్రిల్ 23న రథోత్సవం, ఏప్రిల్ 25న చక్రస్నానం జరుగుతాయన్నారు.
(3 / 6)
ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు.
(4 / 6)
జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు.
(5 / 6)
కంకణబట్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.., ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించామన్నారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెప్పారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు వివరించారు.
(6 / 6)
ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ నాగేశ్వరరావు, ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో నటేష్ బాబు, విజివో బాలి రెడ్డి, ఇతర అధికారులతో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు