Accident to Vande Bharat express: వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు యాక్సిడెంట్
Accident to Vande Bharat express: ఇటీవల భారత ప్రధాని ప్రారంభించిన సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు స్వల్ప ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ధ్వంసమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ముందు భాగం
Accident to Vande Bharat express: ముంబై నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ కు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంటుంది. గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని బాట్వా, మణినగర్ ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Accident to Vande Bharat express: గేదెల గుంపు గుద్దుకుని..
ముంబై నుంచి బయల్దేరిన తరువాత, బాట్వా, మణి నగర్ మధ్య, మరి కాసేపట్లో అహ్మదాబాద్ చేరుకుంటుందనగా, ఈ ట్రైన్ పట్టాలపై వెళ్తున్న గేదెల గుంపును ఢీ కొట్టింది. దాంతో, ట్రైన్ ముందు భాగం కొద్దిగా ధ్వంసమైంది. వెంటనే రైలు సిబ్బంది ధ్వంసమైన ఆ భాగాన్ని తొలగించారు. అనంతరం, రైలు మళ్లీ కదిలింది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ను రూపొందించారు. గత నెలలో ప్రధాని మోదీ ఈ ట్రైన్ ను ప్రారంభించి, కాసేపు ఈ రైలులో ప్రయాణించారు.