Stock market | లాభాల్లో దేశీయ సూచీలు.. వరుస నష్టాలకు బ్రేక్!
Stock market today | దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెనెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్ల మేర వృద్ధి చెందాయి.
Stock market today | వరుస నష్టాల అనంతరం దేశీయ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సూచీలకు సానుకూల పవనాలు అందాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 401పాయింట్లు వృద్ధి చెంది 53,331 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 127పాయింట్లు బలపడి.. 15,935 వద్ద ట్రేడ్ అవుతోంది.
గత సెషన్లో 52,930 వద్ద ముగిసిన సెన్సెక్స్.. శుక్రవారం 53,566 వద్ద ఓపెన్ అయ్యింది. ఇక 15,808 వద్ద ముగిసిన నిఫ్టీ.. 15,977 వద్ద శుక్రవారం సెషన్ను ప్రారంభించింది.
లాభాలు.. నష్టాలు..
సన్ఫార్మా, టైటాన్ షేర్లు 2శాతం మేర లాభపడ్డాయి. బజాజ్ ఫినాన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 1శాతం మేర వృద్ధి చెందాయి.
ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎయిర్టెల్ షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై ఊహాగానాల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగాయి. డాలరు విలువ 20ఏళ్ల గరిష్ఠం వద్దే కొనసాగుతోంది.
కాగా.. ఆసియా మార్కెట్లు మాత్రం ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 2.62శాతం పెరిగింది. ఆస్ట్రేలియా షేర్లు 1.56శాతం వృద్ధి చెందాయి. చైనాలోని సీఎస్ఐ300 సూచీ 0.92శాతం మేర పెరిగింది. హాంగ్కాంగ్ సూచీ 1.8శాతం వృద్ధి చెందింది.
సంబంధిత కథనం
టాపిక్