దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
దిల్లీలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో.. ఏడుగురు మృతి చెందారు. గుడిసెల్లో మంటలు చెలరేగటంలో ఘటన చోటు చేసుకుంది.
దిల్లీలో అగ్ని ప్రమాదం (twitter)
దిల్లీ గోకుల్పురి ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఏడుగురు మృతి చెందారు. శివార్లలోని 60 గుడిసెల్లో మంటల చెలరేగి.. ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు.