Sangli mass suicide : అది ఆత్మహత్య కాదు- మాంత్రికుడి చేతిలో ఆ తొమ్మిది మంది బలి!
Sangli mass suicide : మహారాష్ట్ర సాంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారని అందరు భావించారు. కానీ ఓ మాంత్రికుడు.. వారందరికి విషం పెట్టి చంపేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది!
Sangli mass suicide : మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టించిన 'సాంగ్లీ' ఘటనలో పోలీసులు షాకింగ్ విషయాలను కనుగొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది.. ఆత్మహత్య చేసుకున్నారని ఇంతకాలం అందరు అనుకున్నారు. కానీ వారందరు హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు!
ఆత్మహత్య కాదు..!
సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామానికి సమీపంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవించేవారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. అన్నదమ్ముల్లో ఒకరు టీచర్గాను, మరొకరు పశువుల వైద్యుడిగాను పనిచేసేవారు.
ఈ నెల 20న వారి మృతదేహాలు.. వారి ఇంట్లో నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారన్న వార్త మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. కాగా అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉన్నాయని, ఆ బాధ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కానీ ఈ వ్యవహారంపై అనుమానంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి!
ఓ మాత్రికుడు.. అతని డ్రైవర్.. కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి చంపేశారని పోలీసులు గుర్తించారు. వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.
కాగా.. ఆ మాంత్రికుడు అసలు ఆ కుటుంబాన్ని ఎందుకు చంపాడు? అన్న విషయం ఇంకా తెలియరాలేదు.
సంబంధిత కథనం