Woman kills daughter: కన్న బిడ్డను నాలుగో అంతస్తు నుంచి తోసేసిన తల్లి-bengaluru woman throws four year old daughter from fourth floor ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Kills Daughter: కన్న బిడ్డను నాలుగో అంతస్తు నుంచి తోసేసిన తల్లి

Woman kills daughter: కన్న బిడ్డను నాలుగో అంతస్తు నుంచి తోసేసిన తల్లి

HT Telugu Desk HT Telugu
Aug 05, 2022 04:39 PM IST

Woman kills daughter: తన నాలుగేళ్ల కూతురిని నాలుగో అంతస్తు నుంచి ఓ మహిళ తోసేసింది

నాలుగేళ్ల కూతురిని నాలుగో అంతస్తు పైనుంచి తోసేసి చంపేసిన తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నాలుగేళ్ల కూతురిని నాలుగో అంతస్తు పైనుంచి తోసేసి చంపేసిన తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు (HT_PRINT)

బెంగళూరు: ఓ మహిళ తన నాలుగేళ్ల కుమార్తెను గురువారం మధ్యాహ్నం సంపంగిరామనగర్‌లోని అపార్ట్‌మెంట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి తోసేసి చంపేసింది. ఆమె కూడా భవనంపై నుండి దూకడానికి ప్రయత్నించింది. అది చూసిన అపార్ట్‌మెంట్ వాసులు ఆమెను సురక్షితంగా వెనక్కి లాగారు.

చిన్నారి పేరు ధృతి అని, ఆమె తల్లి దంత వైద్యురాలు సుష్మా భరద్వాజ్‌ అని సంపంగిరామనగర్ పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సుష్మను అరెస్ట్ చేశారు.

ఈ ఘటన మొత్తం భవనంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సుష్మ మధ్యాహ్నం 3.05 గంటల సమయంలో నాలుగో అంతస్తులోని బాల్కనీలో తన కుమార్తెతో కలిసి నడుస్తూ ఫుటేజీలో కనిపించింది. కొంతసేపటి తర్వాత కూతుర్ని ఎత్తుకుని నేలపై పడేసింది.

కొద్ది క్షణాలు ఆగి రైలింగ్ ఎక్కింది. కొద్ది సెకన్ల పాటు నిలబడి దూకడానికి సిద్ధమైంది. ‘కొందరు ఇరుగుపొరుగువారు పాప ఏడుపు విని ఇంటి నుండి బయటకు వచ్చారు. సుష్మను చూసి వారు వెనక్కి లాగారు. పోలీసులకు సమాచారం అందించారు..’ అని అధికారి చెప్పారు.

సుష్మ తన కుమార్తెను రైల్వే స్టేషన్‌లో వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించిందని, అయితే ఆమెను రక్షించామని కుటుంబ సభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. పాప అనారోగ్యంతో బాధపడడంతో సుష్మ డ్రిపెషన్‌లోకి వెళ్లిందని పోలీసులు తెలిపారు.

IPL_Entry_Point