Kerala road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
Kerala road accident today : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 38మంది గాయపడగా.. 9మంది ప్రాణాలు కోల్పోయారు.
Kerala road accident today : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్ర కోసం స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ టూరిస్ట్ బస్సు.. ఆర్టీసీ బస్సును అతి వేగంతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9మంది మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 38మంది గాయపడినట్టు సమాచారం.
ఏం జరిగింది…?
ఎర్నాకుళం జిల్లాలోని మూలంతురుతికి చెందిన ఓ స్కూల్.. 42మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లను విహార యాత్ర కోసం టూరిస్ట్ బస్సులో ఊటీకి తీసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో.. బస్సు వడక్కంచేరికి సమీపంలో కేరళ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ టూరిస్టు బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
Kerala bus accident news : ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 49మంది ఉన్నట్టు సమాచారం. ఆ బస్సు కొట్టరక్కర నుంచి కోయంబత్తూర్కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన అధికారులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సంబంధిత కథనం