Kerala road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం-9 people died while 38 were injured after a tourist bus crashed into rtc bus in kerala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  9 People Died While 38 Were Injured After A Tourist Bus Crashed Into Rtc Bus In Kerala

Kerala road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం

Sharath Chitturi HT Telugu
Oct 06, 2022 08:42 AM IST

Kerala road accident today : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 38మంది గాయపడగా.. 9మంది ప్రాణాలు కోల్పోయారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి
ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది మృతి

Kerala road accident today : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్ర కోసం స్కూల్​ పిల్లలతో వెళుతున్న ఓ టూరిస్ట్​ బస్సు.. ఆర్​టీసీ బస్సును అతి వేగంతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9మంది మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 38మంది గాయపడినట్టు సమాచారం.

ఏం జరిగింది…?

ఎర్నాకుళం జిల్లాలోని మూలంతురుతికి చెందిన ఓ స్కూల్​.. 42మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లను విహార యాత్ర కోసం టూరిస్ట్​ బస్సులో ఊటీకి తీసుకెళ్లింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో.. బస్సు వడక్కంచేరికి సమీపంలో కేరళ ఆర్​టీసీ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ టూరిస్టు బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.

Kerala bus accident news : ప్రమాదం జరిగిన సమయంలో ఆర్​టీసీ బస్సులో 49మంది ఉన్నట్టు సమాచారం. ఆ బస్సు కొట్టరక్కర నుంచి కోయంబత్తూర్​కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన అధికారులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం