5 Army soldiers killed: ఐదుగురు భారతీయ సైనికుల దుర్మరణం-5 army soldiers killed after their vehicle catches fire in j k s poonch ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5 Army Soldiers Killed: ఐదుగురు భారతీయ సైనికుల దుర్మరణం

5 Army soldiers killed: ఐదుగురు భారతీయ సైనికుల దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Apr 20, 2023 07:30 PM IST

5 Army soldiers killed: జమ్మూకశ్మీర్లో ఐదుగురు భారతీయ సైనికులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని, తగలబడడంతో, వారు ప్రాణాలు కోల్పోయారు.

మంటల్లో ఆర్మీ వాహనం
మంటల్లో ఆర్మీ వాహనం (PTI)

5 Army soldiers killed: జమ్మూకశ్మీర్లో ఐదుగురు భారతీయ సైనికులు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని, తగలబడడంతో, వారు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

5 Army soldiers killed: ప్రమాదమేనా?

జమ్మూకశ్మీర్లో భారతీయ సైనికులు ప్రయాణిస్తున్న వాహనం తగలబడడంతో అందులోని ప్రయాణిస్తున్న సైనికుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గాలి నుంచి సాంగియోట్ కు వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన అంశాల గురించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు కారణం ప్రమాదమేనా? మరే కారణమేదైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందన్నారు. వాహనంపై పిడుగు పడడం వల్ల అది తగలబడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆ వాహనానికి ఎలా నిప్పంటుకుంది? ప్రమాదంలో మరణించిన జవాన్ల వివరాలు.. మొదలైనవి ఇంకా వెల్లడి కాలేదు.

IPL_Entry_Point