Budget 2022 | కొత్తగా 400 వందేభారత్ రైళ్లు.. ధాన్యం సేకరణకు రూ.2.37 లక్షల కోట్ల
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ANI)
న్యూఢిల్లీ: ఇందులో భాగంగా కొత్తగా 400 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాలుగు ప్రదేశాల్లో మల్టీ-మోడల్ పార్కుల ఏర్పాటు కోసం కాంట్రాక్టులు పిలవనున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో 100 పీఎం గతి శక్తి టెర్మినల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ధాన్యం సేకరణ కోసం బడ్జెట్లో రూ.2.37 లక్షల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
సంబంధిత కథనం