Stock market news today : ఫ్లాట్గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాభం
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
-Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను ఫ్లాట్గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 82 పాయింట్లు పెరిగి 58,007 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 10 పాయింట్లు పెరిగి 17,087 వద్ద ట్రేడ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 289 పాయింట్ల నష్టంతో 57,925 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 17,076 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 382 పాయింట్లు కోల్పోయి 39,616 వద్దకు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 57891- 17076 వద్ద మొదలు పెట్టాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ బేరిష్గా ఉంది. ప్రతి ర్యాలీలోనూ అమ్మకాల జోరు కనిపిస్తోంది. ఎఫ్ఐఐలు షార్ట్ పొజిషన్లను భారీగా బిల్డ్ చేయడం ఇందుకు ఓ కారణం.
స్టాక్స్ టు బై..
Stocks to buy today : ఓఎన్జీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 148, టార్గెట్ రూ. 156- రూ. 158
జైడస్ లైఫ్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 495- రూ. 500
Tata Motors share price target : టాటా మోటార్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 399, టార్గెట్ రూ. 440
కోల్గేట్ పాల్మోలివ్:- బై రూ. 1521, స్టాప్ లాస్ రూ. 1480, టార్గెట్ రూ. 1560
ITC share price target : ఐటీసీ:- బై రూ. 380, స్టాప్ లాస్ రూ. 374, టార్గెట్ రూ. 392
(ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
లాభాలు.. నష్టాలు..
హెచ్సీఎల్ టెక్, ఇన్ఫీ, టెక్ఎం, టీసీఎస్, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ, టైటాన్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ను స్వల్ప లాభాలతో ముగించాయి. డౌ జోన్స్ 0.23శాతం, ఎస్ అండ్ పీ 500 0.3శాతం, నాస్డాక్ 1.01శాతం మేర లాభపడ్డాయి.
US Stock market investment tips in telugu : ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్లో జపాన్ నిక్కీ 0.38శాతం, సౌత్ కొరియా కాస్పీ 0.23శాతం, ఎస్ అండ్ పీ 200 0.59శాతం మేర నష్టపోయాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 995.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,668.95కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం