Mother dairy milk price hike : మళ్లీ పెరిగిన మదర్ డెయిరీ పాల ధరలు..
Mother dairy milk price hike : పాల ధరలను పెంచుతున్నట్టు మదర్ డెయిరీ ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
Mother dairy milk price hike : దేశంలో ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ.. పాల ధరలను మరోమారు పెంచింది. ఫుల్ క్రీమ్ మిల్క్పై లీటరుకు రూ.1, టోకెన్ మిల్క్పై లీటరుకు రూ. 2 పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన పాల ధరలు.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా.. 500 ఎంఎల్ ప్యాకెట్లలో పంపిణీ చేసే ఫుల్ క్రీమ్ మిల్క్ ధరలను సంస్థ మార్చలేదు.
అందుకే ధరల పెంపు..
ఢిల్లీ- ఎన్సీఆర్ ఆధారిత పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ.. ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలో రోజుకు 30లక్షల లీటర్ల పాలును సప్లై చేస్తుంది ఈ సంస్థ.
Mother dairy : తాజా పెంపుతో.. మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్(లీటర్) ధర రూ. 64కు చేరింది. టోకెన్ మిల్క్ ధర రూ. 50కి పెరిగింది. డెయిరీ ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేసే పచ్చి పాల ధరలతో పాటు ఇతర ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెప్పింది.
"ఈ ఏడాది.. డెయిరీ ఇండస్ట్రీలో డిమాండ్- సప్లై మధ్య వ్యత్యాసం కనిపించింది. ఫీడ్, ఫాడర్, రుతుపవనాల కారణంగా పచ్చి పాల సరఫరాపై ప్రభావం పడింది. అందుకే రేట్లు పెంచుతున్నాము," అని మదర డెయిరీ ప్రతినిధి వెల్లడించారు.
Mother dairy milk latest prices : పెంచిన ధరలతో రైతులు కూడా లబ్ధిచెందుతారని మదర డెయిరీ చెప్పింది. అదే సమయంలో కస్టమర్లకు నాణ్యమైన పాలు కూడా అందుతాయని స్పష్టం చేసింది.
ఢిల్లీ- ఎన్సీఆర్ ఆధారిత మదర్ డెయిరీకి సఫల్ రీటైల్ ఔట్లెట్లతో పాటు ఎన్నో మిల్క్ బూత్లు ఉన్నాయి. పాల ధరల్లో 75-80శాతం వరకు రైతులకు పంపిణీ చేస్తుంది ఈ సంస్థ.
Mother dairy milk price hike news : మదర డెయిరీకి సొంతంగా 9 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. థర్డ్ పార్టీ ఫ్యాక్టరీలను కూడా తీసుకుంది. మొత్తం మీద.. రోజుకు 50లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ కంపెనీ వద్ద ఉంది. తాజా కూరగాయలు, పండ్ల కోసం 4 పాంట్లు ఉన్నాయి. 16 అసోసియేటెడ్ ప్లాంట్లలో ఎడిబుల్ ఆయిల్ను తయారు చేస్తుంది ఈ సంస్థ.
ఇండియాలో వార్షికంగా 210 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. మదర్ డెయిరీతో పాటు అమూల్ పాలను కూడా ప్రజలు వినియోగిస్తూ ఉంటారు. ఢిల్లీ- ఎన్సీఆర్ మార్కెట్లో ఈ సంస్థ రోజుకు 40లక్షల లీటర్ల పాలను పంపిణీ చేస్తుంది.
సంబంధిత కథనం