Gold and silver rates today : పెరిగిన పసిడి, వెండి ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే!
Gold and silver rates today : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 49,600కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 49,450గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1500 పెరిగి, రూ. 4,96,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 4,960గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 160 వృద్ధి చెంది.. రూ. 54,110కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 53,950గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1600 పెరిగి.. రూ. 5,41,100గా ఉంది.
Gold rates today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 54,110గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 55,040గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 49,600గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 54,110గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,110గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,650గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 54,160గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 49,600గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 54,110గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,650గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1300 పెరిగి, రూ. 66,500గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 65,200గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 72,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 66,500.. బెంగళూరులో రూ. 72,500గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం