Gold and silver rate today : పెరిగిన బంగారం ధరలు.. నేటి లెక్కలు ఇలా..
Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. మీ నగరాల్లో నేటి బంగారం, పసిడి ధరల వివరాలు ఇలా..
Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 46,750కి చేరింది. గురువారం ఈ ధర రూ. 46,650గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 1000 పెరిగి, రూ. 4,67,500కి చేరింది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 వృద్ధి చెంది.. రూ. 51,000కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,890గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 1100 పెరిగి.. రూ. 5,10,000గా ఉంది.
Today Gold Rate : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,150గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 51,000గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,930గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,780గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,030గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,000గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,800గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 51,050గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,750గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,000గా ఉంది.
Gold Price Today : ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,730గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1200 దిగొచ్చి.. 57,300కి చేరింది. గురువారం ఈ ధర రూ. 58,500గా ఉండేది.
Silver rate today : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 62,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 57,300.. బెంగళూరులో రూ. 62,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 230 దిగొచ్చి.. రూ 23,270కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,500గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,270గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం