IPL 2022 | కుల్దీప్ క్రీడాస్ఫూర్తికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా
ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్సర్ కుల్దీప్ యాదవ్ మంచి మనసుతో క్రికెట్ అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నాడు. తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సహచర ఆటగాడితో పంచుకున్నాడు.
స్పిన్ ద్వయం కుల్దీప్యాదవ్, అక్షర్ పటేల్ విజృంభణతో బుధవారం పంజాబ్పై ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయడమే కాకుండా పరుగుల్ని కట్టడి చేసి ఢిల్లీ విజయంలో కీలకభూమిక పోషించారు. పంజాబ్ టాప్ ఆర్డర్ వికెట్లు తీసిన కుల్దీప్యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అవార్డును అందుకునే సమయంలో కుల్దీప్ తన సహృదయతతో క్రీడాభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. ఈ అవార్డును అక్షర్పటేల్తో పంచుకోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు కుల్దీప్ యాదవ్.
ట్రెండింగ్ వార్తలు
మిడిల్ ఓవర్స్ లో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన వికెట్లను తీసుకున్నాడని కుల్దీప్ సహచర ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు అక్షర్ పటేల్ కూడా అర్హుడేనని, అతడితో ఈ అవార్డును పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. కెప్టెన్ రిషబ్ పంత్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో సుదీర్ఘ విరామం తర్వాత ఎలాంటి ఒత్తిడులు లేకుండా తన బౌలింగ్ను ఎంజాయ్ చేస్తున్నానని కుల్దీప్ చెప్పాడు. లైన్ అండ్ లెంగ్త్ పైనే పూర్తిగా దృష్టిపెట్టినట్లు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్