PV Sindhu: పీవీ సింధుకు కంగ్రాట్స్ చెప్పిన ఏపీ సీఎం జగన్
PV Sindhu: పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ గేమ్స్లో ఆమె గతంలో బ్రాంజ్, సిల్వర్ గెలవగా.. తొలిసారి గోల్డ్ను సొంతం చేసుకుంది.
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి. అలాగే మెన్స్ సింగిల్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ను కూడా అభినందించారు. గేమ్స్లో వాళ్ల ప్రదర్శన యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా జగన్ అన్నారు.
ఈ ఇద్దరే కాదు కామన్వెల్త్ గేమ్స్లో మెడల్స్ పంట పండిస్తున్న మొత్తం ఇండియన్ టీమ్ను కూడా జగన్ అభినందించారు. సింధు గెలిచిన గోల్డ్తో ఇండియా మొత్తం పసిడి పతకాల సంఖ్య 19కి చేరిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఫైనల్లో కెనడాకు చెందిన మిషెలీ లీపై సింధు 21-15, 21-13 తేడాతో వరుస గేమ్స్లో గెలిచింది.
2018లో గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఓడి సిల్వర్తో సరిపెట్టుకు సింధు.. ఈసారి మాత్రం తన టార్గెట్ను అందుకుంది. ఆ గేమ్స్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ గోల్డ్ గెలిచిన ఆమె.. ఈసారి సింగిల్స్లో ఆ ఘనత సాధించింది. 2022లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ సాధించడంపై అసంతృప్తిగా ఉన్న ఆమె.. సింగిల్స్లో కచ్చితంగా గోల్డ్ గెలుస్తానని ముందే చెప్పి మరీ గెలిచింది.
సంబంధిత కథనం