Pv Sindhu: బ్యాడ్మింటన్ మరో మెడల్ ఖాయం - సింగిల్స్ లో ఫైనల్ చేరిన సింధు
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు ఫైనల్స్ కు చేరుకున్నది.ఆదివారం సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్ తో జరిగిన సైమీ ఫైనల్ మ్యాచ్ లో 21-19 21-17 తేడాతో పీవీ సింధు విజయాన్ని సాధించింది.
బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండియాకు మరో మెడల్ ను ఖాయం చేసింది. ఆదివారం సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో జరిగిన సెమీఫైనల్లో పీవీ సింధు 21-19 21-17 తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో సింధుకు జియామిన్ గట్టి పోటీ నిచ్చింది. తొలి సెట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది.
జియా మిన్ ఆధిక్యంలో ఉన్న తరుణంలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచి సింగపూర్ ప్లేయర్ జోరుకు సింధు అడ్డుకట్ట వేసింది. పోటాపోటీగా సాగిన తొలి గేమ్ లో సింధు 21- 19 తేడాతో విజయాన్ని సాధించింది. రెండో గేమ్ లో సింధుకు జియా మిన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరు ఒక్కో పాయింట్ సాధిస్తూ ముందుకు సాగారు.
స్కోరు 16- 14 ఉన్న తరుణంలో సింధు వరుసగా ఐదు పాయింట్లు సాధించి ప్రత్యర్ధిని ఒత్తిడిలోకి నెట్టింది. 21 -17 తో రెండో గేమ్ గెలిచి ఫైనల్ కు చేరుకున్నది. సింధు ఫైనల్ కు చేరుకోవడంతో బ్యాడ్మింటన్ లో ఇండియాకు మరో పతకం ఖాయమైంది.