Pakistan vs Bangladesh: సెమీస్లో అడుగుపెట్టిన పాక్ - బంగ్లాదేశ్పై విక్టరీ
Pakistan vs Bangladesh: టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ సెమీస్ చేరుకున్నది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
Pakistan vs Bangladesh: టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరుకున్న రెండో జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఇరవై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్ షాంటో మినహా (54 రన్స్)మిగిలిన బ్యాట్స్మెన్స్పెద్దగా రాణించలేదు.
స్వల్ప లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే పాకిస్థాన్ ఛేధించింది. 128 పరుగులు టార్గెట్తో బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజాం చక్కటి ఆరంభాన్ని అందించారు. కానీ ఇద్దరు నెమ్మదిగా ఆడారు. రిజ్వాన్ 32 బాల్స్లో 32 రన్స్ చేయగా బాబర్ ఆజాం 33 బాల్స్లో 25 రన్స్ చేశాడు.
హరీస్ 18 బాల్స్లో 31 రన్స్ చెలరేగడంతో పాకిస్థాన్ మరో 11 బాల్స్ మిగిలుండగానే విజయాన్ని అందుకున్నది. గ్రూప్ 2లో మూడు విజయాలు రెండు ఓటములతో మొత్తం ఆరు పాయింట్లు సాధించిన పాకిస్థాన్ టాప్ ప్లేస్లో నిలిచింది. సెమీ ఫైనల్ చేరుకున్నది.