Lakshyasen: ఇండియాకు మరో గోల్డ్ మెడల్ అందించిన లక్ష్యసేన్
Lakhyasen: కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా గోల్డ్ మెడల్స్ సంఖ్య 20కి చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లోనూ లక్ష్యసేన్ విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల, పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్స్ రెండూ ఇండియా ఖాతాలో చేరాయి. ముందు మహిళల సింగిల్స్లో పీవీ సింధు గోల్డ్ గెలవగా.. ఆ తర్వాత లక్ష్యసేన్ కూడా ఆమె రూట్లోనే పసిడి అందుకున్నాడు. అతడు మలేషియాకు చెందిన ప్రత్యర్థి యాంగ్ను 19-21, 21-9, 21-16 తేడాతో చిత్తు చేశాడు.
ఈ మ్యాచ్లో లక్ష్యసేన్ పోరాడిన తీరు అద్భతమనే చెప్పాలి. తొలి గేమ్లో 19-21 తో పోరాడి ఓడిపోయినా.. రెండో గేమ్లో అద్భుతంగా పుంజుకున్నాడు. ఒక దశలో 6-8 తేడాతో రెండో గేమ్లోనూ వెనుకబడ్డాడు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించిన అతడు.. ప్రత్యర్థికి ఒకేఒక్క పాయింట్ మాత్రమే ఇచ్చి తాను 15 పాయింట్లు రాబట్టాడు.
ఇక మూడో గేమ్ కూడా హోరాహోరీగా నడిచింది. గేమ్ ఇంటర్వెల్ సమయానికి 11-7తో లీడ్లో ఉన్న లక్ష్యసేన్.. ఆ తర్వాత ఆధిక్యాన్ని కొనసాగించాడు. చివరికి మూడో గేమ్ను 21-16తో గెలిచి మ్యాచ్ను, గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు. ఇండియాకు ఈ కామన్వెల్త్ గేమ్స్లో ఇది 20వ గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఈ మెడల్తో ఇండియా మొత్తం మెడల్స్ సంఖ్య 57కు చేరింది.