Dipika Pallikal: కామన్వెల్త్ లో దినేష్ కార్తిక్ వైఫ్ దీపికా పల్లికల్ కు మెడల్
కామన్వెల్త్ గేమ్స్ లో స్క్వాష్ మిక్స్ డ్ డబుల్స్ లో దీపికా పల్లికల్, సౌరభ్ ఘోషల్ జోడి బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నది. భార్య దీపిక బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకోవడంతో క్రికెటర్ దినేష్ కార్తిక్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.
కామన్వెల్త్ గేమ్స్ లో క్రికెటర్ దినేష్ కార్తిక్ వైఫ్ దీపికా పల్లికల్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నది. ఆదివారం జరిగిన స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో దీపికా పల్లికల్, సౌరభ్ ఘోషనల్ జోడీ విజయాన్ని అందుకున్నారు. ఆస్ట్రేలియన్ జంట డోనా లోబాన్, కామెరూన్ పై 2 0 11 8 11 4 తేడాతో దీపికా సౌరభ్ జోడీ విజయాన్ని సాధించారు.
కామెన్వెల్త్ గేమ్స్ 2022లో ఇండియాకు స్క్వాష్ లో ఇది రెండో మెడల్ కావడం గమనార్హం. సింగిల్స్ లో సౌరభ్ ఘోషనల్ బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.బ్రాంజ్ మెడల్ గెలవగానే భార్య దీపికతో పాటు సౌరభ్ ఘోషల్ కు దినేష్ కార్తిక్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందజేశాడు. ‘మీ కృషి, పట్టుదలకు తగిన ఫలితం దక్కింది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
దీపికాపల్లికల్ స్క్వాష్ లో టాప్ టెన్ ర్యాంకులో చోటు దక్కించుకున్న ఇండియన్ ప్లేయర్స్ లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్నది. దినేష్ కార్తిక్ తో ప్రేమలో పడిన పల్లికల్ అతడిని 2015లో పెళ్లాడింది. వీరికి గత ఏడాది కవల పిల్లలు పుట్టారు.ఈ చిన్నారులకు కబీర్, జైన్ అనే పేర్లు పెట్టారు.
టాపిక్