Elections 2024
Elections 2024
18వ లోక్సభ ఎన్నికల నగారా మోగింది. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని, 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెబుతూ మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల కసరత్తు 75 రోజుల్లో ముగియగా, తాజాగా 2024లో ఎన్నికల ప్రక్రియ మొత్తం 81 రోజుల పాటు కొనసాగనుంది.
లోక్సభ పోలింగ్ జరిగే రోజే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆయా తేదీలను కూడా షెడ్యూలులో భాగంగా ప్రకటించింది. అలాగే వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను ఈసీ ప్రకటించింది.
ఎంత మంది ఓటర్లు పాల్గొననున్నారు?
మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 1.8 కోట్లు, 20-29 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 19.74 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఐదవ వంతు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 10.48 లక్షల పోలింగ్ కేంద్రాలు, 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది, 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగం కానున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలు ప్రధానంగా ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య ఉంది.
ఎన్డీయే కూటమి బలం ఇదే
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో నేషనల్ పీపుల్స్ పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)(అజిత్ పవార్), జనతాదళ్(సెక్యులర్), ఏఐఏడీఎంకే (ఓపీఎస్), అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్, పుథియ నీది కచ్చి, జనతాదళ్ (యూ), లోక్జనశక్తి పార్టీ (రాంవిలాస్), రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీ తదితర ప్రధాన పార్టీలు ఉన్నాయి. అలాగే హిందుస్తానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్జనతా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అసోం గణ పరిషద్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, అప్నాదళ్(సోనేలాల్), రాష్ట్రీయ లోక్దళ్, నిషాద్ పార్టీ, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, మిజోనేషనల్ ఫ్రంట్, జననాయక్ జనతా పార్టీ, హర్యానా లోక్హిత్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇండిజినియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నాగా పీపుల్స్ ఫ్రంట్, శిరోమణి అకాలీదళ్ సంయుక్త, భారత్ ధర్మ జనసేన, కేరళ కామరాజ్ కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), రాష్ట్రీయ సమాజ్ పక్ష, ప్రహార్ జనశక్తి పార్టీ, జన సురాజ్య శక్తి, యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ, హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ తదితర పార్టీలు ఉన్నాయి.
ఇండియా కూటమి బలం ఇదే
ఇక కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉన్న ఇండియా కూటమి కొత్తగా ఏర్పడింది. దీని పూర్తి పేరు. ది ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా). దీనికి ఛైర్పర్సన్గా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కేరళ కాంగ్రెస్ (ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ థాకరే), విదుతలై చిరుతైగల్ కచ్చి తదితర పార్టీలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు - 2019
- బీజేపీ303
- ఐఎన్సీ52
- ఇతరులు188
ప్రధాన రాష్ట్రాలు - 2019
Elections 2024
అన్నీ వీక్షించండిThursday, May 16, 2024
Thursday, May 16, 2024
Wednesday, May 15, 2024
Wednesday, May 15, 2024
Wednesday, May 15, 2024
Wednesday, May 15, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Tuesday, May 14, 2024
Monday, May 13, 2024
Monday, May 13, 2024
Monday, May 13, 2024
తరచూ అడిగే ప్రశ్నలు, జవాబులు ( FAQ)
తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి?
తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి
ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి?
ఆంధ్ర ప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి.
తెలంగాణలో 2019లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది
తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందాయి.
ఏపీలో 2019 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది?
ఏపీలో 2019 లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 స్థానాల్లో, తెలుగు దేశం 3 స్థానాల్లో గెలుపొందాయి.