సమ్మర్‌లో నీళ్లు ఇలా ఎక్కువగా తాగితే ప్రమాదం.. ఈరోజు నుంచే జాగ్రత్తపడండి!

By Sanjiv Kumar
Mar 23, 2025

Hindustan Times
Telugu

గోరు వెచ్చని నీరు త్రాగటం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే. కానీ, సమ్మర్‌లో అధికంగా నీరు వేడి చేసుకుని తాగితే ప్రమాదం అని పలు పరిశోధనలు చెబుతున్నాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమట ద్వారా డీ హైడ్రేట్ అవుతారు. 

ఎండకాలంలో వేడినీళ్లు తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇది శరీరంలో సమస్యలు, బాడీ వేడెక్కడానికి దారితీస్తుంది.

వేసవిలో వేడినీళ్లు తాగడం వల్ల కొన్నిసార్లు డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. ఎందుకంటే మీరు శరీర వేడిని నిర్జలీకరణానికి సంకేతంగా గ్రహించవచ్చు. అలాగే, నీటిని ఆదా చేయడానికి ప్రయత్నించవచ్చు, ఇది మీకు మరింత దాహాన్ని కలిగిస్తుంది.

అధికంగా గోరు వెచ్చని నీళ్లు త్రాగటం వల్ల కాలక్రమేణా దంతాలు, చిగుళ్లు దెబ్బతింటాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే, ఇది మీ దంతాల రక్షణ పొరను బలహీనపరుస్తుంది. అలాగే, దంత సమస్యలకు దారితీస్తుంది.

మీకు పుండ్లు లేదా తీవ్రమైన జీర్ణశయ సమస్యలు వంటి సమస్యలు ఉంటే.. ఎక్కువ వేడి నీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే అది మీకు కడుపులో ఇరిటేషన్ కలిగిస్తుంది. 

కొంతమందికి గోరు వెచ్చని నీరు తాగితే కడుపులో ఇరిటేషన్ మొదలవుతుంది. లేదా గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలను పెంచుతుంది. మీకు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

అలాగే ఫిల్టర్ చేయని వేడి నీరు త్రాగటం వ్యాధి సంక్రమణలను పెంచే ప్రమాదం ఉంది. ఆర్ఓ ప్యూరిఫైయర్‌ వంటివి ఉపయోగించడం మంచిది. పరిశుభ్రమైన నీరు తాగితేనే వ్యాధికారక క్రిముల బారిన పడకుండా ఉంటాం.

గోరు వెచ్చని నీటిని మితంగా తాగండి. అలా తాగడమే సురక్షితం అని నిర్ధారించుకోండి. అధికంగా వేడి నీరు తాగితే ప్రమాదమని గుర్తుంచుకోండి.

సరిగ్గా నిద్ర పోవడం లేదా? ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. జాగ్రత్త