ప్రముఖ టెలివిజన్లో ప్రసారమైన 'రాజా రాణి' సీరియల్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సీరియల్లో నటించిన హీరో సంజీవ్, హీరోయిన్ ఆల్య మానస ప్రేమించి వివాహం చేసుకున్నారు.
By Sanjiv Kumar Feb 02, 2025
Hindustan Times Telugu
వీరికి 2020లో ఐలా అనే కుమార్తె జన్మించింది. ఆ తర్వాత కుమారుడు జన్మించాడు. ఇటీవల వీరు ఇద్దరూ కలిసి కళాట యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆల్య తన భర్త సంజీవ్ జరిగిన బ్రేకప్ గురించి మాట్లాడింది.
ఆల్య మాట్లాడుతూ.., 'ఇప్పుడు నాకు పెద్దగా కోపం రాదు. ఎందుకంటే, సంజీవ్ నాతో నేను బేబీ లాంటి కోపం లేని ఆల్యగా ఉండటం చాలా ఇష్టం అన్నాడు. అందుకే నేను అలాగే ఉండటానికి అలవాటు పడ్డాను.' అని చెప్పింది.
'కానీ, ఇంతకుముందు అలా ఉండేది కాదు. చాలా ఎక్కువగా కోపపడేదాన్ని. ఆ సమయంలోనే మాకు బ్రేకప్ అయింది. అప్పుడు ఇద్దరం ఒకే సీరయల్ చేస్తున్నాం. బ్రేకప్ అయిన వ్యక్తితో సీరియల్లో ఎలా కలిసి నటించగలను? ఎలా సన్నిహిత సన్నివేశాలను చేయగలను అనే ప్రశ్న నాకు వచ్చింది' అని తెలిపింది అల్య.
'దీని తరువాతనే, నేను టీమ్తో మాట్లాడి, ఈ సీరియల్లో అయితే నేను నటించాలి. లేదా తను నటించాలి. అది మీరే నిర్ణయించుకోండి అని చెప్పాను' అని అల్య మానస వెల్లడించింది.
'బ్రేకప్ అయిన వారం తర్వాత పూర్తిగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాను. చెప్పాలంటే ఏడుస్తూనే ఉన్నాను. ఒక దశలో దాని వల్ల వీజింగ్ వచ్చి, ఆసుపత్రిలో చేరాను' అని అల్య మానస చెప్పుకొచ్చింది.
'ఒక స్నేహితుడి ద్వారా రాజీ పూర్వకంగా మాట్లాడటానికి సంజీవ్ను సంప్రదించి కలుసుకున్నాను. కానీ నన్ను చూడగానే, అతను వచ్చి కౌగిలించుకున్నాడు' అని అల్య మాసన తన బ్రేకప్ వేదన, ప్యాచప్ గురించి తెలిపింది.
గర్భిణులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో గుమ్మడి గింజలు తినడం వల్ల వారికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.