పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడనున్న రోహిత్ శర్మ!

By Sanjiv Kumar
Jan 19, 2025

Hindustan Times
Telugu

టెస్టు క్రికెట్లో విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీ ఆడతానని ధృవీకరించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్ సిరీస్ లకు జట్టును ప్రకటించడంపై అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ సమాధానమిచ్చాడు. జనవరి 23న జమ్ముకశ్మీర్‌తో మ్యాచ్ ఆడతానని చెప్పాడు.

దీంతో రోహిత్ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. చివరిసారిగా 2015 నవంబరులో వాంఖడే స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ ఆడాడు రోహిత్ శర్మ.

తాను రంజీ ట్రోఫీ ఆడతానని, దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్‌ను ఏ ఆటగాడూ తేలిగ్గా తీసుకోడని రోహిత్ బీసీసీఐపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ చేసిన ప్రకటనపై స్పందిస్తూ ఆటగాళ్లు ఏడాది పొడవునా తమ బిజీ షెడ్యూల్స్ నుంచి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

"గత 6-7 ఏళ్లుగా క్రమం తప్పకుండా క్రికెట్ ఆడుతున్నాను. నేను చాలా అరుదుగా ఇంట్లో కూర్చుంటాను. ఒకవేళ ఐపీఎల్ తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటే దేశవాళీ క్రికెట్ ఉండదు" అని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

దేశవాళీ క్రికెట్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి-మార్చి నాటికి ముగుస్తుంది. ఇదే సమయంలో టీం ఇండియా అనేక సిరీస్ లతో బిజీగా ఉంటుందని రోహిత్ తెలిపాడు.

"బిజీ షెడ్యూల్ కారణంగా నిరంతరం క్రికెట్ ఆడుతున్నాం. ఈ దశలో కొంత విరామం కూడా అవసరం. ఒకదాని తర్వాత ఒకటి సిరీస్‌లకు మనసును ఫ్రెష్‌గా ఉంచుకోవడం ముఖ్యం" అని రోహిత్ అన్నాడు.

ఆవనూనెతో జుట్టుకు 5 అమేజింగ్ బెనిఫిట్స్!